LIVE : బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్​ మీట్ ది మీడియా - Laxman meet with press

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 12:25 PM IST

Updated : Apr 27, 2024, 1:10 PM IST

thumbnail

BJP Leader Laxman Meet with Press : అంబేడ్కర్​ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ అన్నారు. హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామని, రూ.350 కోట్లతో స్ఫూర్తి, దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబేడ్కర్​ చిత్రపటం పార్లమెంటులో పెట్టి భారతరత్నతో గౌరవించామని అన్నారు. అంబేడ్కర్​ త్యాగాలను భవిష్యత్తు తరాలకు అందించాలని ఉద్దేశ్యంతో ఇందా చేస్తున్నామన్నారు. కాంగ్రెస్​ వైఫల్యం వల్లే పాక్​ అధీనంలోకి పీవోకే వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. అయోధ్య నిర్మాణానికి కాంగ్రెస్​ అడుగడుగునా అడ్డుకుందని తెలిపారు. శ్రీరాముడి అవమానించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని పేర్కొన్నారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠకు రాహుల్​ గాంధీ హాజరు కాలేదని ధ్వజమెత్తారు. సోమనాథ్​ ఆలయ పునరుద్ధరణను ఆనాడు కాంగ్రెస్​ వ్యతిరేకించిందని లక్ష్మణ్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిచి, మళ్లీ మూడోసారి ప్రధానిగా మోదీనే ఉంటారని తెలిపారు.

Last Updated : Apr 27, 2024, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.