LIVE : బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మీట్ ది మీడియా - Laxman meet with press
Published : Apr 27, 2024, 12:25 PM IST
|Updated : Apr 27, 2024, 1:10 PM IST
BJP Leader Laxman Meet with Press : అంబేడ్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామని, రూ.350 కోట్లతో స్ఫూర్తి, దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబేడ్కర్ చిత్రపటం పార్లమెంటులో పెట్టి భారతరత్నతో గౌరవించామని అన్నారు. అంబేడ్కర్ త్యాగాలను భవిష్యత్తు తరాలకు అందించాలని ఉద్దేశ్యంతో ఇందా చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే పాక్ అధీనంలోకి పీవోకే వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. అయోధ్య నిర్మాణానికి కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని తెలిపారు. శ్రీరాముడి అవమానించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని పేర్కొన్నారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠకు రాహుల్ గాంధీ హాజరు కాలేదని ధ్వజమెత్తారు. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణను ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకించిందని లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిచి, మళ్లీ మూడోసారి ప్రధానిగా మోదీనే ఉంటారని తెలిపారు.