ETV Bharat / state

మీ సమస్య గురించి తర్వాత ఆలోచిద్దాం- ముందు వైఎస్సార్సీపీలో చేరి గెలిపించండి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 2:25 PM IST

Updated : Mar 14, 2024, 3:42 PM IST

YSRCP_Leader_Asked_to_Join_party_at_Martur
YSRCP_Leader_Asked_to_Join_party_at_Martur

YSRCP Leader Asked to Join party at Martur: సమస్యకు పరిష్కార మార్గం చూపమని సహాయం కోరి వైఎస్సార్సీపీ నేత వద్దకు వెళ్తే రాజకీయ ప్రయోజన కోణంలో ఆ నేత ఆలోచించటంతో అక్కడకు ఎందుకు వెళ్లామా అని వ్యాపారులు బయటకు వచ్చి బాధపడుతున్నారు. విద్యుత్ ఛార్జీలు, పన్నుల భారంతో జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమలు మూసేస్తున్నారు. తనిఖీల పేరుతో మైనింగ్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, గ్రానైట్ వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. వ్యర్థ రాళ్లను సైతం కొలిచి రాయల్టీ, పన్నులు విధించి వ్యాపారుల నడ్డి విరుస్తున్నారని వాపోతున్నారు. ఈ సమస్యపై ఓ నేత వద్దకు వెళ్లిన వ్యాపారులకు ఎదురైన వింత అనుభవం.

మీ సమస్య గురించి తర్వాత ఆలోచిద్దాం- ముందు వైఎస్సార్సీపీలో చేరి గెలిపించండి

YSRCP Leader Asked to Join party at Martur: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందో రాదో అనే అనుమానంతో అధికార పార్టీ నేతలు ఏ చిన్న అవకాశం దొరికినా విడిచిపెట్టటం లేదు. సమస్యలు పరిష్కరించాలని అధికార పార్టీ నేత వద్దకు వెళ్తే సమస్య గురించి పట్టించుకోకుండా వైఎస్సార్సీపీలో చేరాలని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పాటుపడాలని ఆ నేత కోరడం వ్యాపారుల్లో చర్చనీయాంశమవుతోంది.

ఎన్నికల వేళ టీడీపీ నేతలపై అక్రమ కేసులు- 'జగన్​ కక్ష సాధింపు చర్యలు'

బాపట్లలో గ్రానైట్ వ్యాపారుల కష్టాలు: పన్నుల భారంతో, విద్యుత్తు ఛార్జీల భారంతో గ్రానైట్ పరిశ్రమ కునారిల్లుతోంది. కనీసం నిర్వహణ వ్యయాలు రాబట్టుకోలేక గ్రానైట్ పరిశ్రమ సతమతమవుతోంది. దీంతో బాపట్ల జిల్లా మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లో వ్యాపారులు ఏకంగా పరిశ్రమల్ని మూసేసుకున్నారు. అయినా యంత్రాంగం తనిఖీల పేరుతో ఇబ్బంది పెడుతోంది. ఈ తనిఖీల (raids) నుంచి ఉపశమనం కలిగించాలని కోరుతూ కొందరు వ్యాపారులు అద్దంకి వైఎస్సార్సీపీ నేతను ఆశ్రయించారు. సహాయం కోరి వెళ్లిన వ్యాపారులు వింత అనుభవం ఎదురైంది. సమస్యపై బాధితులకు ఊరట దక్కకపోగా పార్టీలో చేరాలని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పాటుపడాలని ఆ నేత కోరడం వ్యాపారుల్లో చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికిప్పుడు నేనైతే తనిఖీలు ఆపాలని చెప్పలేను, అధికారులు కొలతలు కొలిచే విషయంలో, మరో రకంగా అన్యాయం జరిగిందని చెబితే స్వయంగా నేనే వచ్చి మీ క్వారీలు ముందు నిలబడతా, ఆ విషయంలో మీకు అన్యాయం జరగకుండా చూస్తా అని వైఎస్సార్సీపీ నేత పేర్కొన్నాడు. మీరంతా ఏ పార్టీ నాయకులతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతారో ప్రత్యేకించి చెప్పను, ఈ ఒక్కసారికి వైఎస్సార్సీపీ గెలుపునకు పాటుపడండి, వెంటనే వచ్చి పార్టీలో చేరండి, మీకు అండగా ఉంటా అని కోరారు. ఇప్పుడు చేరకుండా తర్వాత చేరతామంటే కుదరదు, అప్పుడు ద్వారాలు మూసేస్తాం అని చెప్పటం గమనార్హం.

వైఎస్సార్సీపీ ఓట్ల ఎర- విందు భోజనాలు, బహుమతుల పంపిణీ

ఇదంతా విన్న వ్యాపారులు సహాయం కోసం అక్కడకు ఎందుకు వెళ్లామా అని బయటకు వచ్చి బాధపడినట్లు తెలుస్తుంది. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లోని గ్రానైట్ పరిశ్రమల్లో రెండు రోజుల నుంచి మైనింగ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు పరిశ్రమలు మూతపడినా అధికారులు తనిఖీలకు రావటం వారిని ఆందోళనకు గురిచేస్తోందని వ్యాపారులు తెలిపారు. పరిశ్రమల్లో ముడిరాయి కోయగా వచ్చే వ్యర్థ రాళ్లను సైతం కొలిచి రాయల్టీ, పన్నులు విధించి వ్యాపారుల నడ్డి విరుస్తున్నారని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. అందుకే తాము తనిఖీలను
వ్యతిరేకిస్తున్నామని, దాడులు పారదర్శకంగా జరగటంలేదని వ్యాపారులను ఇబ్బంది పెట్టే లక్ష్యంగా కొనసాగుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాల్లో లేని తనిఖీలు మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరులోనే ఎందుకు చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని వ్యాపార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అధికార పార్టీ ప్రతి ఒక్కరిని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని, అందులో భాగం గానే తనిఖీలు చేస్తున్నారని వ్యాపారులు పేర్కొన్నారు. తనిఖీలు నిలిపివేయడం కోసం న్యాయపోరాటం చేయాలనే అభిప్రాయంలో కొందరు వ్యాపారులు ఉన్నారని సమాచారం.

ఓటర్లకు వైఎస్సార్సీపీ నేతల తాయిలాలు - ఓటరు కార్డు, ఆధార్​ చూసి మరీ పంపిణీ

Last Updated :Mar 14, 2024, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.