ETV Bharat / state

పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా - ముగ్గురు మృతి - ఆగిన పెళ్లి - Three People Died in Accident

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 10:32 PM IST

Updated : Mar 28, 2024, 10:29 AM IST

Three People Died in Accident
Three People Died in Accident

Three People Died in Accident in Sangareddy District : తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 24 మందికి గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ప్రమాదంతో పెళ్లి ఆగింది. దీంతో వరుడి తాత ఆత్మహత్య చేసుకున్నాడు.

Three People Died in Accident in Sangareddy District : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కూతురిని తీసుకొని వెళ్లడానికి వచ్చిన ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురికి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రమేశ్​కు అందోల్ గ్రామానికి చెందిన మమతతో పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 28న వివాహం ఉండడంతో బుధవారం వధువుని తీసుకొని రావడానికి పాచారం నుంచి పెళ్లి కుమారుడికి సంబంధించిన 29 మంది బంధువులు ఓ ట్రాక్టర్​లో బయలుదేరారు.

Road Accident in Andole Mandal : అందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులోని మలుపు వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భూదమ్మ (52), సంగమ్మ (46), అక్కడికక్కడే మృతి చెందగా ఆశమ్మ చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనలో 24 మంది మహిళలకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనాల్లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం పెళ్లి కార్యక్రమం జరగనుండగా బంధువుల రాక, హడావిడితో సందడిగా ఉన్న ఇంటిలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

పెళ్లి ఇంట విషాదం - కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు వెళ్తుండగా ప్రమాదం - Road Accident

మరో విషాదం : పెళ్లింట మరో విషాదం నెలకొంది. బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో గురువారం జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం - ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య - Three People Commit Suicide

Last Updated :Mar 28, 2024, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.