ETV Bharat / state

అలా ఎలా వదిలేశారు ? - సంధ్య ఆక్వా బస్సు విషయంలో అనేక అనుమానాలు - Sandhya Aqua Bus Incident

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 9:12 AM IST

Sandhya Aqua Bus News Update
Sandhya Aqua Bus News Update

Sandhya Aqua Bus News Update : ఏపీలో విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న వేళ సంధ్య ఆక్వాకు చెందిన బస్సు ఒకటి కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం కొత్త మూలపేట ఎస్సీజెడ్ కాలనీలో కనిపించడం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా అధికారులు తనిఖీలు చేశారు. బస్సులో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను గుర్తించారు. సోదాల తర్వాత బస్సులో ఉన్న కీలక దస్త్రాలను సీబీఐకి అప్పగించకుండా పోలీసులు పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంధ్య ఆక్వా బస్సు విషయంలో అనేక అనుమానాలు

Sandhya Aqua Bus News Update : ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ జిల్లా కొత్తమూలపేట సెజ్‌ కాలనీలో మూడు రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు​ పరిశ్రమకు చెందిన బస్సును నిలిపి ఉంచడం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీలు చేసిన పోలీసులు అందులో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్‌బుక్​లను గుర్తించారు. తర్వాత బస్సును పరిశ్రమ ప్రతినిధులకు అప్పగించారు. ఇప్పుడు దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Vizag Drugs Container Case Update : ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్‌ నుంచి వచ్చిన కంటెయినర్‌లో భారీగా డ్రగ్స్‌ నిల్వలు (Vizag Drug Bust) ఉండటాన్ని గుర్తించిన సీబీఐ అధికారులు అది సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినదిగా నిర్ధారించారు. ఆ తర్వాత రెండురోజుల పాటు మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు పరిశ్రమలో సీబీఐ బృందం విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆ పరిశ్రమకు చెందిన బస్సు మూడప రోజులుగా ఓ ప్రాంతంలో నిలిపి ఉండటం అనుమానాస్పదంగా మారింది. స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెలను పరిశీలించారు.

ఆ ట్వీట్​ వెనుక ఆంతర్యం ఏంటో? - విశాఖ డ్రగ్స్​ కేసులో సందిగ్ధంలో వైఎస్సార్సీపీ - Vizag Drug Bust Update

Police Checks Sandhya Aqua Bus : ఒక్కో అట్టపెట్టెలో పరిశ్రమకు చెందిన దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్‌బుక్​లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్సై స్వామినాయుడు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి బస్సును ఇక్కడ నిలిపి ఉంచడానికి గల కారణాలను తెలుసుకున్నారు. మరమ్మతులకు గురవడంతో మూడు రోజులుగా అక్కడే పార్కింగ్‌ చేయాల్సి వచ్చిందని ప్రతినిధులు తెలిపినట్లు ఎస్సై చెప్పారు. తనిఖీల అనంతరం పరిశ్రమ ప్రతినిధులకు బస్సుతో పాటు అందులోని రికార్డులను అప్పగించినట్లు స్వామినాయుడు వివరించారు.

రికార్డులు బయటకు పంపించాల్సిన అవసరం ఏంటి? : పరిశ్రమకు చెందిన రికార్డులు, చెక్‌బుక్​లు బస్సులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఈ రికార్డులు సంధ్య ఆక్వా పరిశ్రమ నుంచి బయటికొచ్చినట్లు సమాచారం. మరోవైపు తనిఖీలు జరిగితే రికార్డులు బయటకు పంపించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిలో మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. విశాఖలో డ్రగ్స్‌ కంటెయినర్‌ను (Visakhapatnam Drugs Container Case) సీబీఐ అధికారులు ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, మూలపేటలో ఉన్న పరిశ్రమలో సోదాలకు రెండు రోజుల ముందు యాజమాన్యం రహస్య మీటింగ్ నిర్వహించుకున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.

విశాఖ డ్రగ్స్​ కేసులో వైసీపీ నేతల పాత్ర ఏంటి - కంటైనర్​ తెరవకుండా యత్నించారా? - YCP Leaders in Vizag Drug Case

ప్రశ్నలుగానే మిగిలిపోయాయి : సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందిన బస్సును పోలీసులు విడిచిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బస్సుతో సహా రికార్డులను ఆ అధికారులకు అప్పగించాల్సింది పోయి, పరిశ్రమ ప్రతినిధులకు అందజేశామని పోలీసులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. బస్సును ఎలా వదిలేశారన్నది ప్రశ్నార్థకం. మూడు రోజులుగా పరిశ్రమకు సంబంధం లేని మారుమూల ప్రాంతంలో బస్సును ఎందుకు నిలిపి ఉంచారు? వాహనం మరమ్మతులకు గురైందని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నా సరిచేయడానికి 72 గంటల సమయం ఎందుకు పట్టింది అన్నవి ప్రశ్నలుగానే మిగిలాయి.

విశాఖకు కంటెయినర్‌లో వచ్చింది డ్రగ్సే - సీబీఐ నివేదికలో వెల్లడి - VISAKHAPATNAM DRUGS CONTAINER CASE

విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంలో కూనం కోటయ్య కుటుంబం - వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు - Vizag Drugs Case YSRCP Relation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.