ETV Bharat / state

నేడు ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ప్రధాని పర్యటన - రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న మోదీ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 16, 2024, 8:53 AM IST

Prime Minister Modi Kurnool Tour
PM Modi Telangana Tour

PM Modi Telangana Tour Updates : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఈరోజు జరిగే మోదీ సభ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

నేడు నాగర్​కర్నూల్ విజయ సంకల్ప సభలో పాల్గొనున్న మోదీ

PM Modi Telangana Tour Updates : ప్రధాని మోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. శుక్రవారం మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో రోడ్‌ షో నిర్వహించిన ప్రధాని ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి శంఖారావం (Lok Sabha Elections 2024) పూరించనున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నాగర్‌కర్నూల్‌ వేదికగా జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు.

హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్‌లో మధ్యాహ్నాం 11:45 గంటలకు నాగర్‌కర్నూల్ చేరుకోనున్న మోదీ (PM Modi) 12:00 గంటల నుంచి 1:00 గంటల వరకూ అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రస్తుతం మహబూబ్​నగర్ అభ్యర్థిగా డీకే అరుణ (Mahabubanagar BJP Candidate DK Aruna), నాగర్​కర్నూల్ అభ్యర్థిగా భరత్ ప్రసాద్​ను ప్రకటించిన నేపథ్యంలో వారి గెలుపే లక్ష్యంగా మోదీ బహిరంగసభ సాగనుంది. రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి లక్షమందిని తరలించాలని నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్​షో - కాషాయమయమైన రహదారులు

BJP Vijaya Sankalpa Sabha in NagarKurnool : తెలంగాణాలో పాలమూరును బీజేపీ మొదటి నుంచి సెంటిమెంట్‌గా భావిస్తోంది. 2023 శాసనసభ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికల్లో మోదీ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నేపథ్యంలోనే నాగరకర్నూల్‌ వేదికగా పదేళ్లలో కేంద్ర సర్కార్ చేసిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమ పథకాల్ని మోదీ వివరించే అవకాశం ఉంది.

Modi MP Election Campaign in Telangana : ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ- సోమశిల వద్ద వంతెన నిర్మాణం, ప్రసాద్ పథకం కింద అలంపూర్ ఆలయ అభివృద్ధి సహా వివిధ అంశాలను మోదీ ప్రస్తావించే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ, పాలమూరు-రంగారెడ్డికి 60 శాతం నిధులు, జాతీయ విద్యాసంస్థల మంజూరు సహా పలు అంశాలపై హామీలిస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

"కాంగ్రెస్​ పార్టీ కాలం చెల్లింది. బీఆర్​ఎస్​కు ఈ ఎన్నికలకు ఎలాంటి సంబంధమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పడు కాంగ్రెస్​కు, బీఆర్​ఎస్​కు వెేసే ఓటు వృథాగా పోతుంది. తెలంగాణ ప్రజలు మోదీ మళ్లీ ప్రధాని కావాలనుకుంటున్నారు." - ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

'వచ్చే ఐదేళ్లలో జెట్​ స్పీడ్​లో అభివృద్ధి- ఇండియా కూటమికి నిద్రపట్టడం లేదు!'

Modi Joint Mahabubnagar District Tour : నాగర్​కర్నూల్​లో ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగర్​కర్నూల్ గుండా వెళ్లే వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభ అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు మోదీ నాగర్‌కర్నూల్ నుంచి హెలికాప్టర్‌లో కర్ణాటక గుల్బర్గా వెళ్తారు. అక్కడి నుంచి దిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.

ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.