ETV Bharat / state

ఫంక్షన్​ హాళ్లలో శబ్ధ నియంత్రణపై తీసుకుంటున్న చర్యలు ఏంటి? : హైకోర్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 10:41 PM IST

High Court
High Court on Function Hall Sound Case

High Court on Function Hall Sound Case : ఫంక్షన్​ హాళ్లలో శబ్ధ నియంత్రణ, కాచిగూడలో నీటి చౌర్యానికి సంబంధించిన పిటిషన్​లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఫంక్షన్​ హాళ్లలో శబ్ధ నియంత్రణపై తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నీటి దొంగతనానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది.

High Court on Function Hall Sound Case : ఫంక్షన్‌ హాళ్లలో శబ్ధ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు(High Court) ఆదేశాలు జారీ చేసింది. కేవలం రూ.10 వేలు జరిమానా, కేసులు పెడితే ఇవి ఆగవని వ్యాఖ్యానించింది. రూ.10 వేలు చెల్లించేస్తారని పెట్టిన కేసులు తేలడానికి పాతికేళ్లు పడుతుండన్న ధీమాతో ఉంటారని హైకోర్టు అభిప్రాయపడింది. నియంత్రించాలన్న చిత్తశుద్ధి ఉంటేనే తగిన ఫలితాలు కనిపిస్తాయంది. సికింద్రాబాద్ తాడ్బండ్, బోయినపల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ ఫంక్షన్ హాళ్ల వల్ల పరిమితికి మించిన శబ్దాలతో ఇబ్బందిగా ఉంటోందని మిలిటరీ అదనపు చీఫ్ ఇంజనీరు కల్నల్ జె.సతీశ్​ భరద్వాజ్ హైకోర్టుకు లేఖ రాశారు.

అర్ధరాత్రి 12 గంటలు దాటినా శబ్దాలు పరమితికి మించి ఉంటున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇక్కడ సరైన పార్కింగ్​ లేక రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఖాళీ మద్యం బాటిళ్లు, ఆహార వ్యర్థాలతో అస్తవ్యస్తంగా ఉంటోందని హైకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. డయల్​ 100కు ఫోన్​ చేసినా పోలీసులకు ఫిర్యాదు చేసిన తాత్కాలికంగా వచ్చి వెళుతున్నారని కఠిన చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.

కంటోన్మెంట్​ బోర్డుకు నోటీసులు : ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆలోక్​ అరాధే(Justice Alok Aradhe), జస్టిస్​ జె.అనిల్​ కుమార్​లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై పూర్తి వివరణ తీసుకొని చెప్పడానికి గడువు కావాలని అదనపు అడ్వకేట్​ జనరల్​ మహమ్మద్​ ఇమ్రాన్​ కోరారు. అంతేకాకుండా ఇది కంటోన్మెంట్​ ప్రాంతంలో ఉన్నందున కంటోన్మెంట్​ బోర్డును ప్రతివాదిగా చేర్చాల్సి ఉందన్నారు. దీనికి ధర్మాసనం అంగీకరిస్తూ కంటోన్మెంట్​ బోర్డును ప్రతివాదిగా చేర్చుతూ ఆదేశాలు జారీ చేసింది.

ఇది కేవలం సికింద్రాబాద్​లోని రెండు ఫంక్షన్​ హాళ్లకే పరిమితం కాదని, నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే ఇబ్బంది ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. త్వరలో జరిగే పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని కఠిన చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొంది. జరిమానాలు, కేసులతో సమస్యలు తేలవలని శబ్ధ నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటారో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను హైకోర్టు 7వ తేదీకి వాయిదా వేసింది.

High Court Hearing On EMail Petitions : మెయిల్​లో వచ్చిన ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

High Court on Water Theft Case : కాచిగూడ సమీపంలోని నిబోలి అడ్డాల్లో తాగునీటి చౌర్యానికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలంటూ మరో కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నింబోలి అడ్డాలో ఉన్న శిల్ప వాటర్​ ప్లాంట్​ యజమాని డాంగే సింగ్​, అక్రమంగా నీటిని వాడుకోవడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్​ఎంసీ కమిషనర్​లతో పాటు డాంగే సింగ్​కు నోటీసులు(High Court Notice) జారీ చేసింది.

పైపులైన్​ నుంచి శిల్పవాటర్​ ప్లాంటుకు అక్రమంగా నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని తగిన చర్యలు తీసుకోవాలంటూ మహమ్మద్​ సల్మాన్​ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అక్రమంలాగ తీసుకున్న నీటిని పలు ఆసుపత్రులకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారని పిటిషనర్​ పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టి, నీటి చౌర్యంపై తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

సెల్లార్​ నిర్మాణాలపై ముందస్తు అనుమతులు తీసుకోవాలి - స్పష్టం చేసిన హైకోర్టు

పోలీసులు ఉన్నది ప్రజల కోసం - వారిని భయాందోళనలకు గురి చేయడానికి కాదు : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.