ETV Bharat / state

'డ్యులింగో పరీక్ష'లో మాస్‌ కాపీయింగ్‌ - ప్రశ్న ఒకరికి - ఆన్సర్ మరొకరిది

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 9:07 AM IST

Duolingo Exam Scam in Hayathnagar : అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ దేశాల్లోని అంతర్జాతీయ వర్సిటీల్లో ప్రవేశాలకు అర్హతగా భావించే డ్యులింగో పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు నిందితులు ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే పరీక్షకు తెరముందు అసలు అభ్యర్థిని ఉంచి, పక్కన మరొకరితో సమాధానాలిస్తున్న వీరంతా హయత్‌నగర్‌లోని ఓ హోటల్లో పట్టుబడ్డారు. నిందితుల నుంచి 5 ల్యాప్‌టాప్‌లు, 4 పాస్‌పోర్టులు, ఏడు ఫోన్లు, ఒక కీ బోర్డు, మౌస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Duolingo malpractice gang arrested in Hayathnagar
Duolingo malpractice gang arrested in Hayathnagar

Duolingo Exam Scam in Hayathnagar : డ్యులింగో పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌(వీడియో) విధానంలో జరుగుతుంది. అంతర్జాతీయ వర్సిటీల్లో ప్రవేశాలకు ఆంగ్లంలో అభ్యర్థికి ఉన్న ప్రతిభను గుర్తించేందకు పరీక్ష నిర్వహిస్తారు. చాలా యూనివర్సిటీలు దీనిని ప్రామాణికంగా తీసుకుని, అందులో అర్హత సాధించిన వ్యక్తిని ఎంపిక చేస్తారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిర్వాహకులు సమయం, తేదీతో స్లాట్‌ ఇస్తారు. గంటపాటు జరిగే పరీక్షలో అభ్యర్థి తెర ముందు ఉండాలి. నిర్వాహకులు వీడియో ద్వారా వారి ప్రవర్తనను పరీక్షిస్తూ సగం తెరపై ప్రశ్నలు ఇస్తుంటారు. సమాధానం ఇచ్చే సమయంలో అభ్యర్థి ఎక్కువసార్లు కదిలినా, అనుమానాస్పదంగా ప్రవర్తించినా వెంటనే అనర్హుడిగా గుర్తించి లాగ్‌ఔట్‌ అవుతారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఖైతాపూర్‌ గ్రామానికి చెందిన కందకుంట్ల ప్రవీణ్‌రెడ్డి హయత్‌నగర్‌లో ఉంటూ నారాయణగూడ కేశవ మెమోరియల్‌లో బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాడు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌లోని వర్సిటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డ్యులింగో పరీక్షకు గతంలో హాజరై అర్హత సాధించాడు. ఇతనికి ఆంగ్లంలో మంచి నైపుణ్యం ఉన్నట్లు గుర్తించిన హయత్‌నగర్‌కు చెందిన బీబీఏ, బీకాం విద్యార్థులు త్రివేది హరినాథ్‌, బాణాల కృష్ణ అతణ్ని సంప్రదించారు.

JEE Advanced Exam Mass Copying In Hyderabad : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మాస్ కాపీయింగ్‌.. ఎలా జరిగిందంటే..

బీటెక్‌ పూర్తయి విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న విద్యార్థులు తమకు తెలుసని, వారి బదులు డ్యులింగో పరీక్షకు హాజరైతే, రూ.5,000ల నుంచి రూ.10,000ల చొప్పున ఇస్తామని ప్రవీణ్‌కు ఆశచూపారు. డబ్బుకు ఆశపడ్డ ప్రవీణ్‌, అంగీకరించడంతో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌కు తెరలేపారు. ఇదే క్రమంలో బేగంపేటకు చెందిన బీటెక్‌ విద్యార్థులు ఎడవల్లి అరవింద్‌ రెడ్డి, నేనావత్‌ సంతోశ్‌, కాకతీయ వర్సిటీలో ఎంఎస్సీ విద్యార్థి మల్లాడి నవీన్‌ కుమార్‌, మీర్‌పేటకు చెందిన బీటెక్‌ విద్యార్థి ఆలకుంట్ల వినయ్‌ విదేశాల్లో చదివే ప్రయత్నాల్లో ఉన్నారు.

Duolingo Malpractice Case in Hyderabad : డ్యులింగో పరీక్షకు హాజరైనా అనర్హులమవుతామని భావిస్తున్న వీరిని హరినాథ్, కృష్ణ సంప్రదించారు. పరీక్ష ప్రవీణ్‌తో రాయిస్తామని, ప్రతిగా డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పగా వారు అంగీకరించారు. అంతా కలిసి హయత్‌నగర్‌లోని ఒక హోటల్లో గది అద్దెకు తీసుకుని అక్కడి నుంచి మాస్‌ కాపీయింగ్‌ (Duolingo Malpractice Case)కు పాల్పడేందుకు నిర్ణయించారు. డ్యులింగో పరీక్ష ప్రారంభమవగానే అభ్యర్థులు తెర ముందు కూర్చుని పని చేయని కీబోర్డు టైపు చేస్తూ సమాధానాలిచ్చినట్లు నటిస్తారు.

జేఎన్‌టీయూహెచ్‌ పరీక్షల్లో చూచిరాతలు

Duolingo Exam Scam in Hayathnagar
పోలీసులకు పట్టుబడ్డ నిందితులు

Duolingo Malpractice Gang Arrested in Hayathnagar : అభ్యర్థి పక్కనే కూర్చునే ప్రవీణ్‌ ఆన్‌లైన్​లో వచ్చే ప్రశ్నలకు ఫోన్‌లో వెతుకుతూ సమాధానాలిస్తాడు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ బృందం ఆకస్మికంగా తనిఖీలు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రవీణ్‌ను విచారించగా ఇదే హోటల్‌కు పలుమార్లు వచ్చి 20 మంది బదులు పరీక్ష రాసినట్లు గుర్తించారు. వీరంతా డ్యులింగో పరీక్షలో అర్హత సాధించి వివిధ దేశాల్లోని వర్సిటీల్లో ప్రవేశాలు పొందినట్లు తేలింది. హరినాథ్, కృష్ణ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల్ని హయత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

Inter Students Debar in kagaznagar : సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్​ కాపీయింగ్​.. 13 మంది విద్యార్థుల డీబార్​

TSPSC Paper Leakage Case Updates : 'ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రూ.1.63 కోట్ల లావాదేవీలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.