ETV Bharat / crime

జీఆర్​ఈ పరీక్షలో మాస్​ కాపీయింగ్​.. ఒక్కో విద్యార్థి నుంచి రూ.25వేలు వసూలు

author img

By

Published : Feb 1, 2023, 4:55 PM IST

Graduate Record Examination: జీఆర్​ఈలో మాస్​ కాపీయింగ్​ జరిగిందని హైదరబాద్​ సైబర్​ క్రైమ్​ స్టేషన్​లో కేసు నమోదైంది. ఒక్కో విద్యార్థి నుంచి ఈ పరీక్ష రాయడానికి రూ.25వేలు వసూలు చేశారని ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ ఇండియా-ఈటీఎస్​ ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

gre
గ్రాడ్యుయేట్​ రికార్డు పరీక్ష

Graduate Record Examination Mas Coping: గ్రాడ్యుయేట్ రికార్డు పరీక్ష (Graduate Record Examination)లో మాస్ కాపీయింగ్​పై.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ ఇండియా-ఈటీఎస్ ప్రతినిధులు ఆధారాలతో వెళ్లి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో విద్యార్థి నుంచి జీఆర్​ఈ టాప్ స్కోర్ కోసం రూ.25వేలు లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతర్జాతీయ విద్యాసంస్థల్లో సీటు పొందేందుకు రాసే టెస్టులో మాస్ కాపీయింగ్ జరిగిందని వారు తెలిపారు. ఆన్​లైన్​ పరీక్ష గదిలో పక్కనే కూర్చుని జవాబులను ఈ ముఠా పరీక్ష రాసే వారి అందజేసిందని ఈటీఎస్ ప్రతినిధులు ఆరోపించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.