ETV Bharat / state

స్నాప్​చాట్​లో అమ్మాయి పేరుతో చాటింగ్ - రూ. 14 లక్షలు టోపీ - Matrimonial Fraud in Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 8:49 PM IST

MATRIMONIAL FRAUD IN HYDERABAD : స్నాప్​చాట్​లో ఓ అమ్మాయి పేరుతో ఫేక్​ఐడీతో యువకుడితో చాట్​ చేసి రూ.14 లక్షలు కాజేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఆ సొమ్మును పలు బెట్టింగ్​ యాప్​లలో ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది. ఇలాంటి నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

MATRIMONIAL FRAUD IN HYDERABAD
MATRIMONIAL FRAUD IN HYDERABAD (ETV Bharat)

MATRIMONIAL FRAUD IN HYDERABAD : సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు రాష్ట్రంలో సైబర్​నేరాలు పెరుగుతున్నాయి. ప్రజలకు సైబర్​నేరాల పట్ల పోలీసుశాఖ ఎంతగా అవగాహన కల్పించినప్పటికీ ఏదో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. ఈ మధ్య కొంతమంది కేటుగాళ్లు అందమైన అమ్మాయిల ఫొటోలతో ఫేక్​ ప్రొఫైళ్లు సృష్టించి యువతపై ప్రేమ, పెళ్లి పేరుతో ఆశలు రేపుతున్నారు. నమ్మిన బాధితుల వద్ద నుంచి డబ్బును కొల్లగొడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్​ నగరంలో జరిగింది. స్నాప్​చాట్​లో యువతి పేరిట ఖాతా తెరిచి బాధితుడి నుంచి రూ.14 లక్షలు కాజేసిన నేరగాడిని హైదరాబాద్ సైబర్​క్రైమ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మరం అశోక్‌ రెడ్డి అనే యువకుడు స్నాప్‌చాట్‌లో ప్రణీత రెడ్డి పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బాధితుడికి మెసేజ్ చేశాడు. మెల్లగా చాటింగ్​లో మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ నమ్మబలికాడు. అర్జెంట్​గా డబ్బు అవసరం అని చెప్పి వెంటనే పంపించాలని చెప్పి కోరాడు. మరికొంతకాలానికి వ్యాపారం పేరిట బాధితుడి నుంచి డబ్బులు కాజేశాడు. వారు మోసపోయామని బాధితుడికి తెలవనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. తనతో స్నాప్​చాట్​లో చాటింగ్​ చేస్తున్నది అమ్మాయి కాదని తెలుసుకున్న యువకుడు ఖంగుతిన్నాడు.

మీ మొబైల్​కు ఏవైనా అనుమానాస్పద లింకులు వచ్చాయా - వెంటనే ఈ నంబర్​కు వాట్సాప్​ చేసేయండి

Matrimonial Fraud in Hyderabad : తాను సైబర్​నేరగాడి చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితుడి నుంచి సైబర్​ కేటుగాళ్లు రూ.14 లక్షలు కాజేసినట్లుగా గుర్తించారు. వాటిని బెట్టింగ్​ల కోసం ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడు ఆ సొమ్మును సిల్వర్​ బెట్​777.కామ్​, తీన్​పట్టీ గోల్డ్​లాంటి పలు గేమింగ్​ యాప్​లలో ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై 419,420,506 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి చరవాణి, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో స్కామర్‌ లను గుర్తిస్తే వెంటనే రిపోర్ట్‌ చేయాలని, అపరిచితులను నమ్మకూడదని సైబర్‌క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

డీజీపీ ఫొటోతో వాట్సాప్ డీపీ - డబ్బులు డిమాండ్ చేస్తూ సైబర్ కేటుగాళ్ల బెదిరింపులు

పార్ట్​ టైమ్ జాబ్స్​ పేరిట మీకూ ఇలాంటి వాట్సాప్ కాల్స్ వచ్చాయా? - అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే - Part Time Job Scam in hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.