ETV Bharat / state

దిల్లీలో సీఎం రేవంత్ - అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్​తో చర్చలు - cm revanth reddy delhi tour

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 27, 2024, 6:01 PM IST

Updated : Mar 27, 2024, 7:17 PM IST

CONGRESS CEC MEETING DELHI
CM Revanth Reddy Delhi Tour

CM Revanth Reddy Delhi Tour : దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఖర్గే అధ్యక్షతన ప్రారంభమైన కాంగ్రెస్‌ సీఈసీ సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ అభ్యర్థుల మరో జాబితాపై కాంగ్రెస్‌ సీఈసీ చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.

CM Revanth Reddy Delhi Tour : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth) దిల్లీ పర్యటనలో ఉన్నారు. ఖర్గే అధ్యక్షతన ప్రారంభమైన కాంగ్రెస్‌ సీఈసీ సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. లోక్‌సభ అభ్యర్థుల మరో జాబితాపై కాంగ్రెస్‌ సీఈసీ చర్చ జరుగుతోంది. ఈ సమావేశం కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ కూడా సీఎంతో కలిసి దిల్లీ వెళ్లారు.

'ఏప్రిల్​లో తుక్కుగూడలో కాంగ్రెస్‌ జాతీయస్థాయి సభ - అక్కడి నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం' - Congress National level meeting

భువనగిరి, వరంగల్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, ఖమ్మం, కరీంనగర్‌ లోకసభ నియోజక వర్గాలకు అభ్యర్ధులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇవాళ్టి సమావేశంలో ఎనిమిది నియోజక వర్గాలకు అభ్యర్ధులను ప్రకటించేందుకు, ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి చేసింది. నిన్న రాత్రి కూడా సీఎం రేవంత్‌ రెడ్డి నివాసంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దీపాదాస్‌ మున్షీలు సమావేశమయ్యారు. దాదాపు అన్ని నియోజక వర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్‌నేతలు గాంధీభవన్​లో సమావేశం కానున్నారు. ఈసమావేశంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ నెల 29న సాయంత్రం 5గంటలకు గాంధీ భవన్‌లో జరగనున్న టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో, సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

CONGRESS PARLIAMENT CANDIDATES 2024 : కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన మూడు జాబితాల్లో తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌(Congress) ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌, మల్కాజిగిరి అభ్యర్థిగా సునీత మహేందర్‌రెడ్డి, చేవెళ్ల అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ అభ్యర్థిగా ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ(CWC) ఆహ్వానితుడు వంశీచంద్‌ రెడ్డి, జహీరాబాద్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేష్‌ షెట్కర్‌, నల్గొండ అభ్యర్థిగా కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌లను ఎంపిక చేశారు.

'14 ఎంపీ సీట్లే లక్ష్యంగా గెలిచి తీరాలి' - నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - Congress Focus on MP Elections

బీఆర్ఎస్ ఖేల్​ ఖతమ్ - నెక్స్ట్ బీజేపీకి అదే గతి : సీఎం రేవంత్ రెడ్డి - Lok Sabha Elections 2024

Last Updated :Mar 27, 2024, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.