ETV Bharat / politics

బీజేపీ రెండో జాబితా విడుదల - తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఖరారు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 8:58 PM IST

Telangana BJP Lok Sabha Second List Release
Telangana BJP Lok Sabha Second List Release

Telangana BJP Lok Sabha Second List Release : 72 మందితో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 6గురు అభ్యర్థుల పేరును ప్రకటించారు. ఖమ్మం, వరంగల్​ స్థానాలను పెండింగ్​లో పెట్టింది.

Telangana BJP Lok Sabha Second List Release : దేశవ్యాప్తంగా 543 లోక్​సభ స్థానాలు ఉండగా తొలి జాబితాలో 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, 72 మందితో రెండో జాబితా(BJP Second List)ను విడుదల చేసింది. ఈ రెండో జాబితాలో తెలంగాణ నుంచి మొత్తం ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు. మెదక్​ నుంచి రఘునందన్​రావు పేరు ప్రకటించగా, మహబూబ్​నగర్​ నుంచి డీకే అరుణ, ఆదిలాబాద్​ నుంచి గోడెం నగేశ్​, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్​, నల్గొండ నుంచి సైదిరెడ్డి, మహబూబాబాద్​ నుంచి సీతారం నాయక్​ పోటీలో ఉన్నారు. రెండు జాబితాల్లో కలిపి తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 15 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. ఇంకా ఖమ్మం, వరంగల్​ స్థానాలను మాత్రమే బీజేపీ పెండింగ్​లో పెట్టింది.

మొదటి జాబితా(TS BJP First List)లో పెండింగ్​లో ఉంచిన ఆదిలాబాద్​ సిట్టింగ్​ స్థానాన్ని ఎంపీ సోయం బాపూరావుకు ఇవ్వకుండా బీఆర్​ఎస్​ నుంచి బీజేపీలో చేరిన గోడెం నగేశ్​ పార్టీ అధిష్ఠానం ఇచ్చింది. అలాగే బీఆర్​ఎస్​ మాజీ ఎంపీ సీతారాం నాయక్​కు మహబూబాబాద్​ లోక్​సభ టికెట్​ను కన్ఫామ్​ చేసింది. అనుకున్నట్లుగానే మెదక్​ నుంచి అసెంబ్లీ ఎన్నికలో ఓటమి పాలైన రఘునందన్​రావుకు అవకాశం ఇచ్చారు. మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానం నుంచి డీకే అరుణ పోటీ చేయనున్నారు. ముందు నుంచి అనుకున్నట్లుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

రెండో జాబితా విడుదల - తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు
రెండో జాబితా విడుదల - తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు

బీజేపీ అభ్యర్థులు :

  • మెదక్‌- రఘునందన్‌రావు
  • మహబూబ్‌నగర్‌- డీకే అరుణ
  • ఆదిలాబాద్‌- గోడెం నగేశ్‌
  • పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్
  • నల్గొండ – సైదిరెడ్డి
  • మహబూబాబాద్‌- సీతారాం నాయక్‌

బీజేపీ 'టార్గెట్ 370'- నలుగురు కేంద్రమంత్రులకు సీట్లు- ఎంపీగా ఖట్టర్ పోటీ

BJP Lok Sabha First List : తొలి జాబితాలో 195 మందితో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ తెలంగాణకు సంబంధించి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్​ నుంచి కిషన్​ రెడ్డి పోటీ చేయగా, నిజామాబాద్​ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్​ నుంచి బండి సంజయ్​, జహీరాబాద్​ నుంచి బీబీ పాటిల్​, నాగర్​ కర్నూల్​ నుంచి భరత్​ ప్రసాద్​, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్​, భువనగరి నుంచి బూర నర్సయ్య గౌడ్​, హైదరాబాద్​ నుంచి డాక్టర్​ మాధవి లత, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి పేర్లను బీజేపీ ప్రకటించింది.

మొదటి జాబితాలో బీఆర్​ఎస్​ నుంచి బీజేపీలో చేరిన జహీరాబాద్​, నాగర్​ కర్నూల్​ ఎంపీలు బీబీ పాటిల్​, రాములు లకు పార్టీ టికెట్లు ఇచ్చింది. నాగర్​ కర్నూల్​ ఎంపీ రాములు కుమారుడు భరత్​ ప్రసాద్​కు సీటును కేటాయించింది. మొదటి జాబితాలో చోటు దక్కని రఘునందన్​రావు, డీకే అరుణ రెండో జాబితాలో పేర్లను ప్రకటించింది.

మొదటి జాబితా విడుదల - - తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు
మొదటి జాబితా విడుదల - తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు

తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన - మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్​

పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య, రైతులపై హామీల వర్షం- బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.