ETV Bharat / politics

తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన - మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 6:56 PM IST

Updated : Mar 2, 2024, 9:19 PM IST

First List of Telangana BJP Lok Sabha Candidates : బీజేపీ లోక్​సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 195 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్​ తావ్​డే ప్రకటించారు. తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్​సభ అభ్యర్థులను ప్రకటించారు.

Etv Bharat
Etv Bharat

తెలంగాణలోని 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు
తెలంగాణలోని 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు

First List of Telangana BJP Lok Sabha Candidates : బీజేపీ లోక్​సభ అభ్యర్థుల తొలి జాబితా(BJP MP Seats First List)ను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 543 లోక్​సభ స్థానాలు ఉండగా తొలి విడతలో 195 స్థానాలకు లోక్​సభ(Lok Sabha) అభ్యర్థులను వెల్లడించింది. ఈ తొలి జాబితాలో తెలంగాణకు సంబంధించి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 17లోక్​సభ స్థానాలు ఉండగా తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి, నిజామాబాద్ - ధర్మపురి అరవింద్, కరీంనగర్ - బండి సంజయ్, జహీరాబాద్ - బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ - భరత్ ప్రసాద్​, మల్కాజిగిరి - ఈటల రాజేందర్, భువనగిరి - బూర నర్సయ్య గౌడ్, హైదరాబాద్ - డాక్టర్ మాధవి లత, చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. బీజేపీ సిట్టింగ్​ల్లో ముగ్గురికి మరోసారి అవకాశం దక్కగా ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని పెండింగ్​లో ఉంచింది. ఈ స్థానం నుంచి కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తారా లేక సిట్టింగ్​ వ్యక్తికే మరోసారి అవకాశం దక్కుతుందా అనేది వేచి చూడాలి.

BJP Lok Sabha 2024 : వారం రోజుల క్రితం బీజేపీలో చేరిన నాగర్​ కర్నూల్​ బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎంపీ రాములుకు బదులు అతని కుమారుడు భరత్​ కుమార్​కు టికెట్​ దక్కింది. రాములు విజ్ఞప్తి మేరకే అధిష్ఠానం భరత్​ ప్రసాద్​కు టికెట్​ ఇచ్చింది. ఇక రెండు రోజుల క్రితం బీజేపీ గూటికి చేరిన బీఆర్​ఎస్​ జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్​కు మళ్లీ జహీరాబాద్​ నుంచే టికెట్​ దక్కింది. ఇంకా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన హైదరాబాద్​ లోక్​సభ స్థానాన్ని మాధవీ లతకు కేటాయించారు.

తెలంగాణ బీజేపీ 9 మంది అభ్యర్థుల జాబితా :-

క్ర.మపార్లమెంటరీ స్థానాలుఅభ్యర్థులు
1కరీంనగర్​బండి సంజయ్​
2నిజామాబాద్​ధర్మపురి అర్వింద్​
3మల్కాజిగిరిఈటల రాజేందర్​
4సికింద్రాబాద్​కిషన్​ రెడ్డి
5భువనగిరిబూర నర్సయ్యగౌడ్​
6చేవెళ్లకొండా విశ్వేశ్వర్​ రెడ్డి
7జహీరాబాద్​బీబీ పాటిల్ ​
8నాగర్​ కర్నూల్​భరత్​ ప్రసాద్ ​
9హైదరాబాద్​మాధవీలత

భరత్​ ప్రసాద్​ : లోక్​సభ ఎన్నికల్లో నాగర్​ కర్నూల్​ బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్​ ఎంపీ రాములు కుమారుడ పోతుగంటి భరత్​ ప్రసాద్​ పేరును అధిష్ఠానం ప్రకటించింది. 1987 ఆగస్టు 7న జన్మించాడు. తల్లిదండ్రులు రాములు-భాగ్యలక్ష్మి. ఎంటెక్​, ఎల్​ఎల్​బీ, ఎల్​ఎల్​ఎం పూర్తి చేశాడు. భరత్​ ప్రసాద్​ 2018లో రాజకీయ రంగ ప్రవేశం చేసి కల్వకుర్తి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. నాగర్​ కర్నూల్​ జిల్లా పరిషత్​ ఛైర్మన్​గా ఎన్నికయ్యే అవకాశం వచ్చిన బీఆర్​ఎస్​ అవకాశం ఇవ్వలేదు. అలాగే 2023లో శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి తన తండ్రికి లేదా భరత్​ ప్రసాద్​కు అవకాశం ఇవ్వాలని కోరారు కానీ ఆ అవకాశం దక్కలేదు. బీఆర్​ఎస్​ లోక్​సభ సన్నాహక సమావేశాలకు సైతం రాములును, భరత్​ను పార్టీ ఆహ్వానించలేదు. దీంతో బీజేపీ తీర్థం పుచ్చుకుని తన కుమారుడికి టికెట్​ ఇప్పించుకున్నారు రాములు.

Last Updated :Mar 2, 2024, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.