ETV Bharat / politics

ఆ నాలుగు అక్షరాలే బీజేపీ అజెండా : కిషన్​ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 3:11 PM IST

Updated : Mar 2, 2024, 3:53 PM IST

Telangana BJP Chief Kishan Reddy Press Meet : గ్యాన్​ అనే నాలుగు అక్షరాలే బీజేపీ అజెండానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే 2047లో భారత్​ విశ్వగురుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో అభివృద్ధి చెందిన భారతానికి మన మోదీ గ్యారంటీ-మరోసారి మన మోదీ సర్కార్​ పోస్టర్​ను కిషన్​ రెడ్డి ఆవిష్కరించారు.

Telangana BJP Chief Kishan Reddy
Telangana BJP Chief Kishan Reddy Press Meet

Telangana BJP Chief Kishan Reddy Press Meet : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే కూటమికి 400 సీట్లను చేరుకోవడమే లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి(Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని అన్నారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో అభివృద్ధి చెందిన భారతానికి మన మోదీ గ్యారంటీ-మరోసారి మన మోదీ సర్కార్​ పోస్టర్​ను కిషన్​ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

నేడు దేశం సాధిస్తున్న ప్రగతికి, మారుమూల ప్రాంతాల వరకు సంక్షేమ పథకాలు చేరుతున్న తీరుతో బీజేపీ(BJP) జెండాను చూడగానే ప్రజలే స్వచ్ఛందంగా ఇదే మన మోదీ గ్యారంటీ అని చెబుతున్నారని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. ఐదు విభాగాలుగా విజయ సంకల్ప యాత్ర(Vijay Sankalpa Yatra) కొనసాగుతోందని వెల్లడించారు. బీజేపీ సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో వచ్చే ఐదేళ్లకు సంబంధించి అజెండా రూపొందించామని వెల్లడించారు.

జోరుగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు - అధికార పార్టీ లక్ష్యంగా నేతల విమర్శలు

Mana Modi Guarantee for India - Once Again Mana Modi Sarkar : మన తర్వాత స్వాతంత్య్రం వచ్చిన దేశాలు అభివృద్ధి చెందాయని కిషన్​ రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా దేశంలో మౌలిక వసతులు లేవని ఆవేదన చెందారు. 2047 కల్లా భారత్(India)​ ప్రపంచంలో విశ్వగురు స్థానానికి చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047లో అధికారంలో ఎవరు ఉంటారనేది ముఖ్యం కాదని, ఆ సమయానికి కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని తెలిపారు.

"భారతదేశం 75 సంవత్సరాలు అయిన ఇంకా మౌలిక వసతులు లేవు, పేదరికం ఉంది. విద్యావైద్య సౌకర్యాలు లేవు. ఇది ఇలానే వదిలేస్తే ఇంకా వంద సంవత్సరాలు అయిన అభివృద్ధి చెందిన దేశంగా ఎదగము. అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రతిజ్ఞ తీసుకొని 2047లో స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ల పండుగ జరుపుకుంటామో ఆ వచ్చే ఏడాదికి దేశం ఒక డెవలప్​మెంట్​ దేశంగా ఎదిగే విధంగా ముందుకు తీసుకువెళ్లాలి. వచ్చే ఐదేళ్లు కూడా మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అందుకు సంబంధించిన ఎజెండాను కూడా సిద్ధం చేశాము." - కిషన్​ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

దేశంలో అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. అలాగే పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్​ ఉండాలని సూచించారు. 2047 కల్లా భారతీయులు విద్య కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. గ్యాన్​ అనే నాలుగు అక్షరాలు బీజేపీ అజెండా అని తెలిపారు. జీ అంటే గరీబ్​ కల్యాణ్​, వై అంటే యూత్​, ఏ అంటే అగ్రికల్చర్​, ఎన్​ అంటే నారీ శక్తి అని అర్థమని వివరించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఫిర్ ఏక్ బార్-మోదీ సర్కార్ నినాదంతో ముందుకెళ్తామన్నారు.

ఆ నాలుగు అక్షరాలే బీజేపీ అజెండా : కిషన్​ రెడ్డి

మోదీ సారథ్యంలో BJP కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ- త్వరలో లోక్​సభ అభ్యర్థుల తొలి జాబితా

'టార్గెట్ 400'- గెలుపు గుర్రాలపై బీజేపీ ఫోకస్- ఫస్ట్ లిస్ట్​లోనే మోదీ, షా పేర్లు!

Last Updated :Mar 2, 2024, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.