ETV Bharat / politics

చేవెళ్ల వేదికగా సాయంత్రం కేసీఆర్‌ బహిరంగ సభ - వరుణుడు కరుణిస్తాడా? - Rainfall Chances to BRS Meeting

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 3:12 PM IST

KCR Election Campaign Start at Chevella
Rainfall Chances to Chevella BRS Meeting

Rainfall Chances to Chevella BRS Meeting : బీఆర్​ఎస్​ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్నారు. ఇందుకోసం చేవెళ్ల వేదికగా జరగనున్న బీఆర్​ఎస్​ బహిరంగ సభకు గులాబీ నాయకులు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పు వల్ల సభా ప్రాంగణమంతా మేఘావృతమై వరుణుడు కరుణిస్తాడా, సభ సజావుగా సాగుతుందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Rainfall Chances to Chevella BRS Meeting : చేవెళ్ల సెంటిమెంట్​గా బీఆర్ఎస్ అధినేత ఇవాళ చేవెళ్లలో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిగా జరిగాయి. కానీ వాతావరణంలో మార్పు వల్ల శుక్రవారం రాత్రి అక్కడక్కడ చిరుజల్లులు పడడంతో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం జరిగే బీఆర్​ఎస్​ బహిరంగ సమావేశానికి(BRS Public Meeting) వరుడు కరణిస్తాడా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వర్షం పడితే పార్టీ నాయకులు చేసిన కృషి అంతా వృధా అవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు జరగనున్న సమావేశానికి పార్టీ నాయకులు పూర్తి ఏర్పాట్లు చేశారు.

కేసీఆర్​ ప్లాన్​​ ఛేంజ్​ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్​ షోలతోనే ఎన్నికల ప్రచారం

కరీంనగర్ కదనభేరితో ఇప్పటికే పార్లమెంట్​ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇవాళ చేవెళ్ల వేదికగా జరగనున్న బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్నారు. చేవెళ్లలో పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో గులాబీ బాస్​ పాల్గొని ప్రసంగిస్తారు. చేవెళ్ల ఫరా ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్​ సభకు(KCR Sabha) భారీగా జన సమీకరణ చేసి విజయవంతం చేసేలా గులాబీ​ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.

BRS Public Meeting in Chevella : ఇందులో భాగంగా పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను కూడా నియమించారు. ఈ నెల 16న మెదక్ నియోజకవర్గంలోనూ కేసీఆర్​​ సభాసమావేశం జరగనుంది. సంగారెడ్డి నియోజకవర్గం సుల్తాన్‌పుర్ సమీపంలోని సింగూరు చౌరస్తా వద్ద నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో గులాబీ బాస్​ లోక్‌సభ ఎన్నికల ప్రచారం(Lok Sabha Election Campaign) నిర్వహించనున్నారు.

ఈసారి ఎక్కువగా బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్‌తో పాటు మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్​రావు(Harish Rao) విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్​ వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్​ఎస్​ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది.

KCR Election Campaign Start at Chevella : ఇదే సమయంలో పదేళ్ల గులాబీ పార్టీ​ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పదేళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ, ప్రజల్లోకి దూసుకు వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బీఆర్​ఎస్ సిద్ధం చేస్తోంది.

ఎండిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేసీఆర్ - బీఆర్​ఎస్​ అండగా ఉంటుందంటూ భరోసా​

పార్లమెంటు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించిన బీఆర్​ఎస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.