ETV Bharat / politics

'ఆయ్ అండీ, గాలి మారిందండీ' ఇదీ గోదావరి జిల్లాల ఓటర్‌ మనోగతం - AP Elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 10:50 AM IST

Updated : Apr 13, 2024, 11:37 AM IST

Political situation In Godavari Districts
Political situation In Godavari Districts

Political situation in Godavari Districts : ఏపీలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయ పరిస్థితులపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఎవరూ నిరాకరించలేదు. వైసీపీ ప్రభుత్వంపై తమ అభిప్రాయాల్ని అడిగితే పదిమందిని కదిలిస్తే ఏడుగురు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏకరువు పెట్టారు. మందుబాబులు, నిరుద్యోగ యువకులు, డ్రైవర్లు, వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరూ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వెళ్లగక్కారు.

Political situation in Godavari Districts : ఆంధ్రప్రదేశ్​లోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పదిమందిని కదిలిస్తే ఏడుగురు తమ ఇబ్బందులు చెబుతున్నారు. సామాన్యులు, పేదలు కూడా ధరల పెరుగుదలతో కష్టపడుతున్నామని వివరించారు. ఈటీవీ భారత్ ప్రత్యేక ప్రతినిధి మంగళ, బుధవారాల్లో ఈ రెండు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించారు.

People Against to YSRCP : ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, తణుకు మీదుగా నిడదవోలు చేరారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి రావులపాలెం, అంబాజీపేట, రాజోలు, చించినాడ వంతెన, పొదలాడ, తాటిపాక మీదుగా అంబాజీపేట, అమలాపురం వరకు పర్యటించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలతో చర్చించిన తరువాత వైసీపీ ప్రభుత్వంపై (People Against to YSRCP)వస్తున్న వ్యతిరేకతపై ప్రత్యేక కథనం.

AP Elections 2024 : ఏపీలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఎవరూ నిరాకరించలేదు. ప్రశ్నించిన ప్రతి వ్యక్తీ స్పందించారు. కాకపోతే ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు’ అని ఎదురు ప్రశ్నించారు. వ్యక్తిగత పని మీద ఇలా వచ్చామని, ఆసక్తి కొద్దీ అడుగుతున్నామని చెప్పి వారి అభిప్రాయాలు సేకరించగా చాలా స్వేచ్ఛగా మనసులో మాట చెప్పారు. ప్రభుత్వంపై మీ అభిప్రాయాలేంటి, మీ ప్రాంతంలో ఏమనుకుంటున్నారని ఎదురు ప్రశ్నించి ఆసక్తిగా విన్నారు.

మందుబాబుల్లో ఆగ్రహం : మందుబాబులు ప్రస్తుత పరిస్థితులపై కోపంగా ఉన్నారు. అమలాపురం సెంటర్లో గురువారం రాత్రి ఒక వ్యక్తి ఎదురయ్యారు. ‘గతంలో క్వార్టర్‌ బాటిల్‌ రూ.50కే కొనేవాళ్లమని వెల్లడించారు. కిక్కు ఉండేదని, ఇప్పుడు ధర పెరిగిందని అయితే, ఎంత తాగినా కిక్కే లేదని ఆరోపించాడు. బటన్లు నొక్కి డబ్బులిచ్చినా అన్నీ ఇలాగే ఖర్చయిపోతున్నాయని వాపోయాడు. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపించొచ్చని వ్యాఖ్యానించాడు. పదిమందిలో ముగ్గురు, నలుగురు ఇళ్ల స్థలాలు వచ్చాయని, పింఛన్లు వస్తున్నాయని, పథకాల సొమ్ములు వస్తున్నాయని సానుకూలంగా స్పందించారు. పనిలో పనిగా ధరలు ఇబ్బందులు పెడుతున్నాయని, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

చిలకలూరిపేటలో వైసీపీ ఖాళీ - మాజీ ఇన్‌ఛార్జితో పాటు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ సహా కౌన్సిలర్లు టీడీపీలో చేరిక - NO More YSRCP in Chilakaluripet

రాజకీయ పరిణామాలనూ గుర్తిస్తూ: అమలాపురం, అంబాజీపేట జనగళం సభల్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ ఓటు బదిలీ గురించి విజ్ఞప్తి చేశారు. గాజుగ్లాసు లేనిచోట సైకిల్‌, కమలం గుర్తులకు, సైకిల్‌ లేని చోట గాజుగ్లాసు, కమలం గుర్తుకు ఓటు వేయాలని ఇద్దరూ ప్రజలను కోరారు. చాలాచోట్ల ప్రజలు ‘కూటమి’ అని ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయన్న భావన ప్రజల్లో ఏర్పడింది.

ఆ పార్టీలను ‘కూటమి’ గానే గుర్తించి తమ మాటల్లో ఆ పేరుతోనే ఉచ్ఛరిస్తున్నారు. వారి నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తోందా, టీడీపీ పోటీ చేస్తోందా అన్న స్పష్టత సామాన్య ప్రజానీకంలో ఉంది. ఇవన్నీ ఒక కీలక పరిణామానికి, రాజకీయ మార్పునకు దారి తీస్తున్నాయా? అన్న ప్రశ్నలు కలిగిస్తున్నాయి. దీనికితోడు కొందరి నోళ్లలో ‘ఈ సారి గాలి మారిపోతోందండీ’ అని వినిపించిన ఒక మాట వేగంగా మారుతున్న పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోంది.

'మేం ఆర్టీసీ డ్రైవర్లం సార్‌. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఒక్కోసారి ప్రభుత్వ ఉద్యోగులంటారు. ఒక్కోసారి కార్పొరేషన్‌ ఉద్యోగులకు ఈ రాయితీలు, వసతులు వర్తించబోవంటారు. ఎందుకొచ్చిన విలీనం? మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్రంలో ఎన్నోచోట్లకు తిరుగుతున్నాం. అన్నిచోట్లా ప్రజల స్పందన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది.' - కాకినాడ జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్ల స్పందన

ఎలా ఉందంటే ఏం చెబుతామండీ? రోడ్లు వేశారేంటండీ? ఎలా వెళ్లాలి ఈ రోడ్ల మీద? ఉపాధి కూడా లేదండీ మాకు. ఇళ్ల స్థలం ఇచ్చామంటున్నారు. కట్టుకోవడానికి డబ్బులు సరిపోవు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంటామండీ? కష్టపడితే రోజుకు 500 రూపాయలు వస్తున్నాయి. ధరలు పెరిగిపోయాయి. ఎన్నికల్లో ఇవన్నీ ఆలోచిస్తాం కదండీ. - అమలాపురంలో 45 ఏళ్ల వ్యక్తి స్పందన

'ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నా. ఈసారి పరిస్థితులు మారకపోతే నేను హైదరాబాదో, బెంగళూరో వెళ్లిపోతాను. సరైన ఉద్యోగంలేక ర్యాపిడోలో పని చేస్తున్నాను.' - రాజమహేంద్రవరంలో ఒక యువకుడి స్పందన

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Slams YSRCP

వైసీపీ కోడ్‌ అమలు చేస్తున్న ఖాకీలు - జగన్‌ భక్త అధికారుల అత్యుత్సాహం - AP Elections 2024

Last Updated :Apr 13, 2024, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.