ETV Bharat / politics

మీరు ఓటేయాలనుకుంటున్న అభ్యర్థి ఏం చదువుకున్నారో తెలుసా? - MP CANDIDATES EDU QUALIFICATION

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 11:54 AM IST

Telangana Lok Sabha Candidates Educational Qualifications
Telangana Lok Sabha Candidates Educational Qualifications

Telangana Lok Sabha Candidates Educational Qualifications : లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచిన రాష్ట్రంలోని అభ్యర్థుల విద్యార్హతలు ఏంటో తెలుసా? అసలు వారు ఎంతవరకు చదువుకున్నారో తెలుసుకోవాలని ఉందా? మీరు ఓటు వేసేటప్పుడు కచ్చితంగా వారి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు మీకోసం.

Lok Sabha Candidates Educational Qualifications in Telangana : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల విద్యార్హతలు గురించి ఓ లుక్కేద్దామా? అయితే మీరే చూడండి ప్రధాన పార్టీల అభ్యర్థులు 51 మంది ఉంటే అందులో మూడో వంతు మంది అనగా 17 మంది అభ్యర్థులు ఇంటర్​, ఆలోపే చదువుకున్నారు. ఐదుగురు వైద్యులు కాగా, మజ్లిస్​ అభ్యర్థితో కలిపి ఐదుగురు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఒక మాజీ ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు ఎన్నికల బరిలో నిలిచి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అభ్యర్థుల అఫిడవిట్లలలో పొందుపరిచిన విద్యార్హతలు :

  • ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న వారిలో పదో తరగతి అంతకంటే తక్కువ చదివినవారు ఆరుగురు కాగా, ఇంటర్మీడియట్​ చదివినవారు 11 మంది ఉన్నారు.
  • అఖిల భారత స్థాయి అధికారులు ముగ్గురు ఉన్నారు. వారిలో రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి వెంకట్రామిరెడ్డి మెదక్​ నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా పోటీ చేయగా, నాగర్​ కర్నూల్​ నుంచి రిటైర్డ్​ ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ బీఆర్​ఎస్​ తరఫున బరిలో నిలిచారు. మరో రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి చొల్లేటి ప్రభాకర్​ నల్గొండ లోక్​సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
  • విదేశాల్లో ఐదుగురు అభ్యర్థులు చదువుకున్నారు. ముందుగా ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ హార్వర్డ్​ యూనివర్సిటీలో పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​లో మాస్టర్స్​ చేశారు. హైదరాబాద్​ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్​ ఓవైసీ లండన్​లో లా పూర్తి చేయగా, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి అమెరికాలో ఎంఎస్​ పూర్తి చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అమెరికాలో గ్రాడ్యుయేషన్​ చేయగా, భువనగిరి కాంగ్రెస్​ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​ రెడ్డి సైప్రస్​లో హోటల్​ మేనేజ్​మెంట్​ కోర్సు చేశారు.
  • వైద్యులు : చేవెళ్ల కాంగ్రెస్​ అభ్యర్థి రంజిత్​ రెడ్డి వెటర్నరీ సైన్స్​లో మాస్టర్స్​(ఎంవీఎస్సీ) పూర్తి చేశారు. మల్లు రవి(కాంగ్రెస్​), కడియం కావ్య(కాంగ్రెస్​), బూర నర్సయ్యగౌడ్​(బీజేపీ), సుధీర్​కుమార్​(బీఆర్​ఎస్​)లు ఎంబీబీఎస్​, ఆపై చదువులు చదువుకొని వైద్యులుగా సేవలందించారు.
  • పీహెచ్‌డీ, పీజీ : మహబూబాబాద్​ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్​ అజ్మీరా సీతారాంనాయక్​ పీహెచ్​డీ పూర్తి చేశారు. రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి వెంకట్రామిరెడ్డి సహా 11 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు. ఇందులో 10 మంది ఎంఏ, ఒకరు ఎంబీఏ చేశారు. ఒకరు బీటెక్​ చేయగా మరో 10 మంది వివిధ డిగ్రీలు చదివారు. బీబీ పాటిల్​(బీజేపీ), సురేశ్​ షెట్కార్​(కాంగ్రెస్​)లు మహారాష్ట్రలో ఏజీ బీఎస్సీ చేశారు. ఈ ఇద్దరు నేతలు జహీరాబాద్​లో తలపడుతున్నారు. టి.జీవన్​రెడ్డి(కాంగ్రెస్​), బి. వినోద్​కుమార్​(బీఆర్​ఎస్​), రఘునందన్​రావు(బీజేపీ)లు న్యాయ విద్య(ఎల్​ఎల్​బీ) చదివారు. ఇద్దరు డిప్లొమా పూర్తి చేశారు.

సార్వత్రిక ఎన్నికలు 2024 - రాష్ట్రంలో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు ఎందరో తెలుసా?

దేశంలో మోదీ గాలి వీస్తోంది, ఈసారి 400 సీట్లు సాధిస్తాం - గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.