ETV Bharat / politics

సార్వత్రిక ఎన్నికలు 2024 - రాష్ట్రంలో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు ఎందరో తెలుసా? - Woman in TS Lok Sabha Polls 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 10:01 AM IST

Telangana Woman MP Candidates 2024
Telangana Woman MP Candidates 2024

Telangana Woman MP Candidates 2024 : జనాభాలో సగం అతివలేె. పురుషులతో సమానంగా రాణిస్తున్నా, చట్టసభల్లో మాత్రం వీరి ప్రాతినిథ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. ప్రస్తుత్త లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ప్రధాన పార్టీల టికెట్లు పొందిన వారు ఆరుగురు మాత్రమే. మరోవైపు 2014, 2019ల్లో పార్లమెంట్‌లో అడుగుపెట్టింది ఒక్కొక్కరే.

Woman Contesting in Telangana Lok Sabha Elections 2024 : జనాభాలో సగం మహిళలే. ఓటర్ల సంఖ్యలోనూ అంతే. కానీ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థుల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మూడు పార్టీల నుంచి 51 మంది అభ్యర్థులు బరిలో ఉంటే, వీరిలో టికెట్లు పొందిన నారీమణులు ఆరుగురు ఉన్నారు. అంటే సుమారు 12 శాతమే.

Telangana Woman MP Candidates 2024
పట్నం సునీత, కడియం కావ్య, ఆత్రం సుగుణ

Lok Sabha Elections 2024 : ఈ ఆరుగురిలో హస్తం పార్టీ ముగ్గురు మహిళలకు టికెట్లు ఇవ్వగా, బీజేపీ ఇద్దరికి, బీఆర్ఎస్‌ ఒకరికి అవకాశం కల్పించాయి. కాంగ్రెస్‌ నుంచి వరంగల్‌లో కడియం కావ్య, మల్కాజిగిరిలో పట్నం సునీత మహేందర్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో ఆత్రం సుగుణ ఉన్నారు. బీజేపీ తరఫున మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, హైదరాబాద్‌లో కొంపెల్ల మాధవీలత ఉండగా బీఆర్ఎస్‌ నుంచి మహబూబాబాద్‌లో మాలోత్‌ కవిత లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు ఆయా స్థానాల్లో ఇతర ప్రధాన పార్టీల నుంచి పురుషులు పోటీ చేస్తున్నారు.

Telangana Woman MP Candidates 2024
డీకే అరుణ, కొంపెల్ల మాధవీలత, మాలోత్‌ కవిత

2014 లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తర్వాత 2019లో తెలంగాణ నుంచి ఒక్కో మహిళ మాత్రమే ఎంపీగా విజయం సాధించారు. అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ గడప తొక్కింది ఇద్దరే. 2014లో నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత (బీఆర్ఎస్‌) గెలుపొందారు. 2019లో అదే స్థానం నుంచి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఏకైక మహిళా ఎంపీ మాలోత్‌ కవిత. మహబూబాబాద్‌ నుంచి గులాబీ పార్టీ అభ్యర్థిగా ఆమె విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమె అదే స్థానం నుంచి పోటీలో ఉన్నారు.

ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీ నేతలు - అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం - main Parties Campaign in Telangana

2014లో 12 మంది - 2019లో 25 మంది : 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి చూస్తే కల్వకుంట్ల కవిత మాత్రమే పోటీచేశారు. మొత్తం మహిళా అభ్యర్థులు 12 మంది ఉన్నప్పటికీ, మిగిలిన వాళ్లు బీఎస్పీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఉన్నారు. అదే 2019కి వచ్చేసరికి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన మహిళా అభ్యర్థుల సంఖ్య కొద్దిగా పెరిగింది. బీఆర్ఎస్‌ నుంచి కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), మాలోత్‌ కవిత (మహబూబాబాద్‌) ఉన్నారు. హస్తం పార్టీ తరఫున రేణుకాచౌదరి (ఖమ్మం) ఉండగా బీజేపీ నుంచి బంగారు శ్రుతి (నాగర్‌కర్నూల్‌), డీకే అరుణ (మహబూబ్‌నగర్‌) పోటీ చేశారు. ఇతర పార్టీల వారిని, ఇండిపెండెంట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ ఎన్నికల్లో పోటీచేసిన మొత్తం మహిళల సంఖ్య 25.

కర్ణాటక లోక్​సభ బరిలో 21మంది మహిళలు- జాతీయ పార్టీల తరఫున 8మంది పోటీ- నారీ శక్తి చూపుతారా? - Woman In Karnataka LS Polls 2024

తొలి విడత ఎన్నికల్లో 135 మంది మహిళలు పోటీ- కేవలం 8 శాతమే - Women In LS Polls 2024 1st Phase

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.