ETV Bharat / politics

విజన్ డాక్యుమెంట్​ పేరుతో ధర్మపురి అర్వింద్ స్థానిక మేనిఫెస్టో - 'గతంలో పసుపు బోర్డు, ఇప్పుడు ఉద్యోగాల కల్పనే లక్ష్యం' - Mp Arvind Release Local Manifesto

author img

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 7:03 PM IST

MP Arvind on Congress : నెలలోపు కాంగ్రెస్​ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ అన్నారు. సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ హిందువులకు సూక్తులు చెబుతున్నారని, అదే మరో వర్గానికి చెప్పగలరా అని ధ్వజమెత్తారు. ఇవాళ నిజామాబాద్​లో ​విజన్ డాక్యుమెంట్ పేరుతో స్థానిక మేనిఫెస్టో ​రిలీజ్​ చేసిన ఆయన, కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

MP Arvind on CM Revanth and KTR
MP Arvind on Congress (ETV Bharat)

MP Arvind on CM Revanth and KTR : గత ఎన్నికల్లో పసుపు బోర్డుపై హామీ ఇచ్చి సాధించానని, ఈసారి ఉద్యోగ అవకాశాలు పెంచడంపై దృష్టి పెడతామని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​ పేర్కొన్నారు. గల్ఫ్ వలసలు నివారిస్తామని, వృత్తి శిక్షణ ఇస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ నిజామాబాద్​లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అర్వింద్​ 10 అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ పేరుతో స్థానిక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే స్థానిక 10 హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. గుజరాత్‌ మోడల్‌ గురించి సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్పారని అన్నారు. గుజరాత్‌ మోడల్‌కు విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌ నిదర్శనమని తెలిపారు.

తెలంగాణ సర్కార్​, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని అర్వింద్ మండిపడ్డారు. కొత్త రేషన్ కార్డ్​లు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం ఇంకా ఇవ్వకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అంతకముందు ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూరులో రోడ్​ షోలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్​, మాజీ మంత్రి కేటీఆర్​పై ​​నిప్పులు చెరిగారు. జైశ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అంటున్న కేటీఆర్​కు, ముస్లింల టోపీ నెత్తి మీద పెట్టుకుంటే కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు.

MP Arvind on Hindu religion : దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి అంటున్న సీఎం రేవంత్​రెడ్డి, మసీద్​లో నుంచి వచ్చే శబ్దం మా చెవిలో ఎందుకు ఉండాలో సమాధానం చెప్పగలరా అని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సూక్తులన్ని హిందువులకు మాత్రమే చెబుతారని, మరో వర్గానికి ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. నెల రోజుల్లో కాంగ్రెస్​ ప్రభుత్వం కూలిపోతుందని, ఆ పార్టీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి అనుకుంటే వెంటనే పడిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీకి ఓటేయాలనుకుంటున్నారని, పోలింగ్​ అయిపోగానే కాంగ్రెస్​ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు. ముస్లింల ఓట్ల కోసం ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, మరి హిందువులవి ఓట్లు కావా అని ప్రశ్నించారు.

'వేలాది సంఖ్యలో ఎంప్లాయిమెంట్​ జనరేషన్​కు మేం ఈసారి దృష్టి సారిస్తాం. ఈ వచ్చే ఐదేళ్లకు పది అంశాలతో కూడిన విజన్​ పేరుతో డాక్యుమెంట్​ విడుదల చేశా. పసుపు బోర్డు మీద ఏ రకంగా ఫోకస్​ చేశామో, ఈసారి ఎంప్లాయిమెంట్​ జనరేషన్ మీద అలాగే ఫోకస్​ చేస్తాం. ఎలా చేస్తామో విజన్​ డాక్యుమెంట్​లో పొందుపరిచాం. గుజరాత్‌ మోడల్‌ గురించి సీఎం రేవంత్‌ రెడ్డి గొప్పగా చెప్పారు. ఇది గుజరాత్‌ మోడల్‌ ప్రణాళిక.' - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి

లోక్​సభ ఎన్నికల్లో గెలస్తే స్థానిక పది హామీలను అమలు చేస్తాం : ఎంపీ అర్వింద్ (ETV Bharat)


పీఎఫ్‌ఐ, సిమీ లాంటి తీవ్రవాద సంస్థలకు కాంగ్రెస్ కేంద్రంగా మారింది : ఎంపీ అర్వింద్​ - MP Arvind Allegation on Congress

దేశంలో మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసింది కాంగ్రెస్​ ప్రభుత్వమే : అర్వింద్ - Arvind Fires on Congress

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.