ETV Bharat / business

పేటీఎం షేర్లు మరో 20% పతనం - కంపెనీకి రూ.17వేల కోట్లకు పైగా నష్టం!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 12:35 PM IST

Paytm shares crash another 20 Percent
Paytm shares tank another 20 pc

Paytm Shares Tank Another 20 PC : పేటీఎం మాతృసంస్థ వన్​97 కమ్యునికేషన్స్ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. గురువారం 20 శాతం నష్టపోయిన ఈ కంపెనీ షేర్లు, శుక్రవారం మరో 20 శాతం వరకు పతనం అయ్యాయి. దీనితో షేర్ వాల్యూ రూ.487 కంటే దిగువకు పడిపోయింది.

Paytm Shares Tank Another 20 PC : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ లిమిటెడ్​పై ఆర్​బీఐ ఆంక్షలు విధించడంతో దాని మాతృసంస్థ వన్​97 కమ్యునికేషన్స్​ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. గురువారం దాదాపు 20 శాతం వరకు నష్టపోయిన ఈ కంపెనీ షేర్లు, శుక్రవారం మరో 20 శాతం వరకు పతనమయ్యాయి. దీనితో వన్​97 కమ్యునికేషన్​ షేర్లు అత్యంత లోవర్ సర్క్యూట్​కు పడిపోయాయి.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ లిమిటెడ్​ ఫిబ్రవరి 29 తరువాత ఖాతాదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకూడదని ఆర్​బీఐ ఆదేశించింది. దీనితో పేటీఎం వాలెట్లు, ఫాస్టాగ్​లు ఫిబ్రవరి 29 తరువాత ఉపయోగించడానికి వీలులేకుండా పోతుంది. అందుకే మదుపరులు ఈ కంపనీ మాతృసంస్థ అయిన వన్​97 కమ్యునికేషన్స్ షేర్లను భారీ ఎత్తున అమ్మేస్తున్నారు.

శుక్రవారం వన్​97 కమ్యునికేషన్ షేర్స్​ 20 శాతం వరకు నష్టపోయాయి. దీనితో బీఎస్​ఈలో ఈ కంపెనీ షేర్ వాల్యూ రూ.487.05లకు పడిపోయింది. ఎన్​ఎస్​ఈలో కూడా ఈ కంపెనీ స్టాక్ వాల్యూ రూ.487.20కు దిగివచ్చింది. దీనితో ఈ రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్​ రూ.17,378.41 కోట్లు తగ్గి, రూ.30,931.59 కోట్లకు పడిపోయింది. అంతేకాదు ఆర్​బీఐ ఆంక్షల నేపథ్యంలో కంపెనీ వార్షిక ఆదాయం కూడా దాదాపు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు తగ్గవచ్చని అంచనా.

ఫిబ్రవరి 29 తరువాత సేవలు కొనసాగుతాయి : పేటీఎం సీఈఓ
ఫిబ్రవరి 29 తరువాత కూడా తమ యాప్​ సర్వీసులు కొనసాగుతాయని పేటీఎం సీఈఓ విజయ్​ శేఖర్ శర్మ స్పష్టం చేశారు. పేటీఎం యాప్​ సేవలను తమ కస్టమర్లు ఎప్పటిలానే వాడుకోవచ్చని ఆయన కంపెనీ ట్విటర్ అకౌంట్​లో పోస్ట్ చేశారు.​

ఆర్​బీఐ ఆంక్షలు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్​ (PPBL) ఫిబ్రవరి 29 తరువాత ఖాతాదారుల నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆర్​బీఐ ఆదేశించింది. అయితే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ సర్వీసులు సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. కనుక ఆర్​బీఐ ఆర్డర్స్ వీటిపై ప్రభావం చూపవు. కనుక పేటీఎం అందిస్తున్న స్టాక్ మార్కెట్, మ్యూచువల్​ ఫండ్​ సర్వీసులపై నేరుగా ప్రభావంపడదు. కానీ ఇది మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే పేటీఎం షేర్లు భారీగా పతనం అవుతున్నాయి.

ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్తున్నారా? ట్రావెల్​ ఇన్సూరెన్స్ మస్ట్​ - బెనిఫిట్స్ ఏమిటంటే?​

మంచి మైలేజ్​ ఇచ్చే బైక్​​ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్-10​ ఆప్షన్స్​​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.