ETV Bharat / bharat

కన్నడ నాట 'నారీ' ఎన్నికల స్వారీ- రాష్ట్ర చరిత్రలో తొలిసారి- విజయం ఎవరిదో? - Woman Candiadates MP In Karnataka

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 6:47 PM IST

Woman Candidates MP In Karnataka : కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలిసారి అత్యధిక సంఖ్య మహిళలు జాతీయ పార్టీల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ఇద్దరు మహిళలు బరిలో నిలవడం విశేషం.

Woman Candiadates MP In Karnataka
Woman Candiadates MP In Karnataka

Woman Candidates MP In Karnataka : కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలిసారి అత్యధిక సంఖ్యలో మహిళలు కొంగు బిగించి ఎన్నికల రణ క్షేత్రంలో దిగుతున్నారు. జాతీయ పార్టీల నుంచి ఎనిమిది మంది మహిళలు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఇలా కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ నుంచి ఇంత మంది మహిళా అభ్యర్థులు ఎంపీ ఎన్నికల్లో బరిలో నిలవడం ఆసక్తి రేపుతోంది.

కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ఇద్దరు మహిళలు బరిలో నిలవడం విశేషం. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో కర్ణాటకలో తొలిసారి ఎక్కువమంది మహిళలు బరిలో నిలిచిన ఎన్నికలుగా ఇవి గుర్తింపు పొందాయి. రంగంలోకి దిగిన మహిళా మణులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో ఎవరు గెలుస్తారన్న దానిపై కన్నడిగుల్లో ఉత్కంఠ రేగుతుండగా ఫలితాలు మాత్రం జూన్ 4న రానున్నాయి.

గతంలో ఇలా
1999 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఒక్క మహిళ మాత్రమే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1999 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బళ్లారి లోక్‌సభ నుంచి కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఒక మహిళ మాత్రమే కర్ణాటక నుంచి ఎన్నికయ్యారు. పార్టీలు కూడా మహిళలకు ఎక్కువగా టికెట్లు కేటాయించలేదు. కర్ణాటక శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఆమోదం తెలిపింది. తర్వాత పార్లమెంటు ఉభయ సభలు కూడా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాయి.

ఈ బిల్లులో 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి అమల్లోకి రానుంది. అప్పుడు దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. కానీ అంతకుముందే కర్ణాటకలో మహిళలు ఎక్కువగా సీట్లు సంపాదించి సత్తా చాటారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు మహిళలకు ఇవ్వగా కాంగ్రెస్‌ ఒక అడుగు ముందుకేసి ఆరు సీట్లు ఇచ్చింది. జేడీఎస్ ఏ నియోజకవర్గంలోనూ మహిళలకు టిక్కెట్లు ఇవ్వలేదు.

అభ్యర్థులు వీరే
కాంగ్రెస్ తొలి జాబితాలోనే శివమొగ్గ నియోజకవర్గం నుంచి గీతా శివరాజ్‌కుమార్‌ పేరును అభ్యర్థిగా ప్రకటించారు. రెండో జాబితాలో బెంగళూరు సౌత్ నుంచి సౌమ్య రెడ్డి, దావణగెరె నుంచి ప్రభా మల్లికార్జున, ఉత్తర కన్నడ నుంచి అంజలి లింబాల్కర్, బాగల్‌కోటే నుంచి సంయుక్త పాటిల్, చిక్కోడి నియోజకవర్గం నుంచి ప్రియాంక జార్కిహోళి బరిలో నిలిచారు. భారతీయ జనతా పార్టీ నుంచి బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి శోభా కరంద్లాజే, దావణగెరె నియోజకవర్గం నుంచి గాయత్రి సిద్ధేశ్వర్ బరిలో నిలిచారు.

అప్పుడు టికెట్లే లేవు
1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు మహిళలకు టిక్కెట్లు ఇవ్వలేదు. 1999లో కాంగ్రెస్‌ ఇద్దరు మహిళలకు, బీజేపీ ఒకరికి టిక్కెట్లు ఇచ్చాయి. 1999లో బళ్లారిలో సోనియా గాంధీపై బీజేపీ అభ్యర్థి సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. ఈ ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ ఎన్నికల్లో సోనియా ఘన విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు మహిళలకు అసలు టికెట్లే కేటాయించలేదు. కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు దూసుకుపోతున్నారు. విజయ కేతనం ఎవరు ఎగరేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

సీనియర్లు VS జూనియర్లు- మంత్రుల వారసులు బరిలోకి- కర్ణాటకలో రసవత్తర రాజకీయం - Lok Sabha Election 2024 Karnataka

'ఎలక్షన్ కింగ్' 239వ నామినేషన్- మోదీ, రాహుల్​తో ఢీ- ఇప్పటి వరకు రూ.కోటి లాస్​! - Election King Padmarajan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.