ETV Bharat / bharat

మొబైల్ ఫోన్​ మింగేసిన ఖైదీ- నెల రోజులుగా అలానే!- ఆపరేషన్​ చేసిన డాక్టర్లు షాక్ - prisoner swallows mobile phone

author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 4:07 PM IST

Prisoner Swallows Mobile Phone
Prisoner Swallows Mobile Phone(ANI, Etv Bharat)

Prisoner Swallows Mobile Phone : ఖైదీ మింగేసిన మొబైల్ ఫోన్​ను ఆపరేషన్ చేసి కడుపులో నుంచి బయటకు తీశారు వైద్యులు. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జైలులో జరిగింది.

Prisoner Swallows Mobile Phone : కర్ణాటకలోని శివమొగ్గ సెంట్రల్ జైలులో ఉన్న ఓ ఖైదీ మింగేసిన మొబైల్ ఫోన్​ను వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ప్రస్తుతం ఖైదీ కోలుకుంటున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అతడు ఎప్పుడు, ఎందుకు మొబైల్ ఫోన్​ను మింగేశాడో అనేది ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే?
పరశురామ్ అనే ఖైదీ గత కొన్నాళ్లుగా శివమొగ్గ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గత నెల రోజులుగా జైలులో పరశురామ్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అధికారులు పరశురామ్​ను వైద్యం కోసం జైలు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. పరశురామ్​ను పరిశీలించిన ఆయన, శివమొగ్గలోని మెగాన్‌ ఆస్పత్రికి తరలించమని జైలు అధికారులకు సూచించారు. దీంతో అతడిని మెగాన్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరశురామ్​కు పరీక్షలు చేశారు. ఖైదీ కడుపును ఎక్స్ రే తీశారు. ఎక్స్ రేలో ఫలితాల్లో పరశురామ్ కడుపులో ఏం ఉందో స్పష్టంగా వైద్యులకు తెలియలేదు. దీనిపై పరశురామ్​ను వైద్యులు ప్రశ్నించగా, రాయి ఉందని అతడు సమాధానం చెప్పాడు. అయితే, మెగాన్ ఆస్పత్రిలో ఎండోస్కోపీ సౌకర్యం లేకపోవడం వల్ల పరశురామ్​ను ఏప్రిల్ 1న బెంగళూరులోని సెంట్రల్ జైలు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు అధికారులు.

బెంగళూరు సైంట్రల్ జైలు సీనియర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏప్రిల్ 6 వరకు పరశురామ్​కు చికిత్స అందించారు. ఆ తర్వాత విక్టోరియా ఆస్పత్రికి పరశురామ్​ను తరలించమని ఆయన సిఫార్సు చేశారు. అక్కడికి తరలించగా ఆస్పత్రి వైద్యులు ఏప్రిల్ 25న పరశురామ్​కు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులో ఉన్న మొబైల్ ఫోన్ తీశారు. అతడి కడుపులో ఫోన్​ను చూసిన వైద్యులు షాక్ అయ్యారు. ప్రస్తుతం పరశురామ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అతడు కోలుకుంటున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

బల్లిని మింగేసిన నిందితుడు
అత్యాచారం కేసులో నిందితుడిగా అరెస్టై పోలీసుల రిమాండ్​లో ఉన్న ఓ నిందితుడు తనను జైల్లో ఉంచుతారనే భయంతో ఏకంగా బల్లినే మింగేశాడు. ఈ విచిత్ర సంఘటన కొన్నాళ్ల క్రితం ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​ జిల్లాలో జరిగింది. నిందితుడు బల్లిని మింగటాన్ని చూసిన పోలీసు సిబ్బంది ఒక్కసారిగా షాక్​​కు గురయ్యారు. వెంటనే అతడ్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Safety Pin Stuck Boy Trachea : సేఫ్టీపిన్​ను మింగిన 5 నెలల చిన్నారి.. ఐదు రోజుల పాటు నరకం.. చివరికి..

బాలుడి శ్వాసనాళంలో విజిల్.. ఊపిరి వదిలితే సౌండ్.. క్లిష్టమైన ఆపరేషన్ చేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.