ETV Bharat / bharat

వాటర్​ఫాల్స్​కు వెళ్లి వస్తూ అనంతలోకాలకు- లారీ, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 10:21 AM IST

Updated : Jan 28, 2024, 11:23 AM IST

Road Accident In Tamil Nadu Today : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.

Road Accident In Tamil Nadu Today
Road Accident In Tamil Nadu Today

Road Accident In Tamil Nadu Today : తమిళనాడులోని తెన్కాసి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, వీరంతా వాటర్​ఫాల్స్​కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో చనిపోయినవారిని తెన్కాసి జిల్లా పులియంగుడిలోని పులియంగుడికి చెందిన కార్తీక్, మనోజ్, సుబ్రమణి, మనోకరణ్, బోతి రాజ్​గా పోలీసులు గుర్తించారు. వీరంతా శనివారం సాయంత్రం పులియంగుడిలోని బాలసుబ్రమణ్య సామి ఆలయ ఉత్సవాలకు వెళ్లారు. ​ఆ తర్వాత కుర్తాళం జలపాతాన్ని సందర్శించారు. అనంతరం తమ స్వగ్రామానికి కారులో తిరిగి బయలుదేరారు. కారు ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయానికి పున్నయ్యపురం సింగిలి పట్టి వద్దకు చేరుకుంది. ఇంతలో సిమెంట్ బస్తాలతో ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్​తో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆ వ్యక్తి మరణించాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చుని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బ్రిడ్జిపై ఒకేసారి ఐదు వాహనాలు ఢీ- ముగ్గురు సజీవ దహనం
తమిళనాడులోని తోపుర్ కనుమ ప్రాంతంలో ఇటీవలే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ వంతెనపై అదుపుతప్పి రెండు కార్లు సహా మరో రెండు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహన మయ్యారు. ప్రమాదానికి కారణమైన లారీ బ్రిడ్జిపై నుంచి బోల్తా పడింది. ఈ క్రమంలో కార్లన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి

యూపీలో ఘోర ప్రమాదం- ట్యాంకర్, ఆటో ఢీ- 12 మంది మృతి

ట్రక్కు బోల్తా పడి ఆరుగురు మృతి- మరో 11 మందికి గాయాలు

Last Updated :Jan 28, 2024, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.