ETV Bharat / bharat

బామ్మకు పాముకాటు వేయించి హత్య- రూ.కోటి బీమా సొమ్ము కోసం మనవడి దారుణం- చివరకు!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 9:23 AM IST

Grandson Killed Lady For Insurance Claim
Grandson Killed Lady For Insurance Claim

Man Killed Grandmother For Insurance : కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఓ యువకుడు తన అమ్మమ్మ పాలిట కాలయముడయ్యాడు. మృతురాలిపై పేరు మీద బీమా చేయించి, పాము కాటుతో చనిపోయేలా చేశాడు. అనంతరం ఇన్సూరెన్స్​ ద్వారా కోటి రూపాయలు అందుకున్నాడు. చివరకు కటాకటాలపాలయ్యాడు. ఛత్తీస్​గఢ్​లో జరిగిందీ ఘటన.

Man Killed Grandmother For Insurance : ఛత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లాలో కోటీశ్వరుడు కావాలనే తపనతో ఓ యువకుడు తన అమ్మమ్మ చనిపోయేలా చేశాడు. ముందుగానే ఆమెకు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ చేయించి, బాధితురాలు మృతి చెందిన తర్వాత ఆ సొమ్మును అందుకున్నాడు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

అసలే జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- బాందే పోలీస్​స్టేషన్​ పరిధికి చెందిన మృతురాలు రాణి పఠారియా భర్త కొన్ని నెలల క్రితం మరణించాడు. దీంతో రాణి తన కుమార్తె ఇంటికి వచ్చేసింది. అయితే మృతురాలి మనవడు ఆకాశ్​ కోటీశ్వరుడు కావాలని కుట్ర పన్నాడు. తన అమ్మమ్మను హత్య చేయించాలని ప్లాన్ వేశాడు. అంతకుముందు ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్​ ద్వారా తన అమ్మమ్మ పేరు మీద రూ.కోటి బీమా పాలసీ చేయించాడు.

రూ.30వేలు సుపారీ ఇచ్చి!
అయితే పాము కాటుతో బాధితురాలు చనిపోతే బీమా సొమ్ము రూ.కోటి అందుతుందని ఆకాశ్​కు ఏజెంట్ చెప్పాడు. దీంతో బాధితురాలికి పాము కాటు వేయించేందుకు ఆకాశ్​ పథకం వేశాడు. ఓ వ్యక్తికి రూ.30వేలు సుపారీ ఇచ్చాడు. ఏదో అబద్దం చెప్పి తన అమ్మమ్మను ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు ఆకాశ్​. ఆ సమయంలో సుపారీ ఇచ్చిన వ్యక్తి ద్వారా పాముతో కాటు వేయించాడు. దీంతో ఆ మహిళ చనిపోయింది. పాము కాటు వేయడం వల్లే బాధితురాలు చనిపోయిందని అందరినీ నమ్మించాడు ఆకాశ్.

అలా దొరికిపోయాడు!
వృద్ధురాలు మరణించిన కొద్దిరోజులకే బీమా ఏజెంట్​ ఇన్సూరెన్స్​ను క్లెయిమ్ చేశాడు. ఆ తర్వాత ఆకాశ్​ రూ.కోటిపైగా బీమా సొమ్మును అందుకున్నాడు. అయితే రాణి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అప్పటికే ప్రారంభించారు. ఇటీవలే మరోసారి బాధితురాలి కుటుంబసభ్యులను విచారించారు. ఆ సమయంలో ఆకాశ్​ పదేపదే మాటలు మార్చాడు. దీంతో అనుమానం పెంచుకున్న పోలీసులు ఆరా తీశారు. దీంతో విచారణలో నిజం ఒప్పుకున్నాడు ఆకాశ్​. అతడిని అరెస్ట్​ చేసిన పోలీసులు- నిందితుల నుంచి రూ.10 లక్షల నగదు, మృతురాలి నగలు స్వాధీనం చేసుకున్నారు.

భార్యపై అనుమానం- నోట్లో కరెంట్​ వైర్​ పెట్టి హత్య చేసిన భర్

మద్యం మత్తులో పక్కింటి బాలుడి హత్య- పొలంలో మృతదేహం వేసి పరార్​- పీక్కు తిన్న జంతువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.