ETV Bharat / bharat

నేడే లోక్​సభ ఎన్నికల నోటిఫికేషన్​- ఏపీ సహా రాష్ట్రాల అసెంబ్లీలకు ​షెడ్యూల్​

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 12:44 PM IST

Updated : Mar 16, 2024, 7:16 AM IST

General Election 2024 Notification Date : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్​ను విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. ఈ నెల 16న (శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ ప్రకటించనుంది.

General Election 2024 Notification
General Election 2024 Notification

General Election 2024 Notification Date : దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం శాసనసభల ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే జమ్ముకశ్మీర్‌ శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటిస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేదు.

ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్‌ 16న ముగియనుంది. అప్పటిలోగా కొత్త సభ ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ, స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు జరిపి షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ 2019 మార్చి 10వ తేదీన విడుదలైంది. ఏప్రిల్‌ 11 నుంచి ప్రారంభమైన పోలింగ్‌, మే 19 వరకు ఏడు విడతల్లో ముగిసింది. 2019 మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.

నోటిఫికేషన్​కు ముందే అభ్యర్థుల ప్రకటన
మరోవైపు నోటిఫికేషన్​ రాకముందే రాజకీయ పార్టీలు ఎన్నికల సమరంలోకి దిగాయి. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్​ సహా అన్ని పక్షాలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ తొలి జాబితాలో 195 మందిని ప్రకటించగా, రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేసింది. మరోవైపు కాంగ్రెస్ సైతం తొలుత 39మందితో జాబితా విడుదల చేయగా, రెండోసారి 43 మంది అభ్యర్థులను ప్రకటించింది. టీఎంసీ, ఆప్​, ఎస్​పీ ఇలా దాదాపు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి.

ఈసీతో గూగుల్‌ జట్టు- ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌!

'నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే లక్ష్యం' - సీఈసీ రాజీవ్ కుమార్​

Last Updated :Mar 16, 2024, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.