తెలంగాణ

telangana

పెళ్లికి 10రోజుల ముందు కిడ్నాప్​.. యువతిని ఎత్తుకుని మంట చుట్టూ ఏడు ప్రదక్షిణలు

By

Published : Jun 6, 2023, 6:46 PM IST

Updated : Jun 6, 2023, 7:24 PM IST

woman kidnapped rajasthan

రాజస్థాన్​లోని జైసల్మేర్​లో దారుణం జరిగింది. ఓ యువతిని 10 మంది దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను బలవంతంగా వివాహం చేసుకునేందుకు యత్నించాడు నిందితుల్లో ఒకడు. అసలేం జరిగిందంటే?  
జైసల్మేర్​కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో జూన్​ 12 వివాహం జరగాల్సి ఉంది. అయితే జూన్​ 1వ తేదీన పుష్రేంద్ర, అతని అనుచరులు కలిసి ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం ఎడారిలోకి తీసుకెళ్లి పుష్పేంద్ర.. యువతిని చేతులతో ఎత్తుకుని మంట చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశాడు. 

బాధితురాలు ఏడుస్తున్నా కూడా నిందితుడు పుష్పేంద్ర.. పట్టించుకోకుండా ఆమెను చేతితో ఎత్తుకుని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడు సార్లు తిరిగాడు. బాధితురాలిని.. వేరొక యువకుడిని పెళ్లి చేసుకోవద్దని కూడా నిందితుడు పుష్పేంద్ర బెదిరించినట్లు తెలుస్తోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితులను అరెస్ట్ చేశారు.  

ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ స్వాతి మలివాల్​ సైతం స్పందించారు. మరోవైపు.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​.. అధికారులను ఆదేశించారు.

Last Updated :Jun 6, 2023, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details