తెలంగాణ

telangana

NIA officials search in Telangana and Chhattisgarh : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో 8 చోట్ల ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2023, 3:34 PM IST

Updated : Sep 9, 2023, 5:42 PM IST

NIA officials search in Telangana
NIA officials search Chhattisgarh

15:26 September 09

NIA

NIA officials Search in Telangana and Chhattisgarh: తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. రాష్ట్రంలో వరంగల్​ జిల్లాలో 5 ప్రాంతాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 చోట్ల అధికారులు(NIA Officials) దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ ఒక ప్రాంతంలో సోదాలు చేసిన అధికారులు.. కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. జూన్​లో చెర్ల పోలీస్టేషన్ పరిధిలో ముగ్గురిని అరెస్ట్ చేసిన స్థానిక పోలీసులు.. భారీగా పేలుడు పదార్ధాలు, డ్రోన్లు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఆగస్ట్​లో మరో కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ అధికారులు దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.

NIA Search 8 Areas in Telangana and Chhattisgarh : దర్యాప్తులో భాగంగా తెలంగాణా, ఛత్తీస్‌గఢ్​లో కలిపి మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేశారు. కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రస్తుతం నిపుణులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టులకు అయుధాలు, సామాగ్రిని సరఫరా చేస్తురన్న అభియోగంపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పట్టుబడిన ముగ్గురిప్రాధమిక విచారణలో పీపుల్స్ వార్(Peoples War) పేరుతో మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలపారు. దేశవాళీ తుపాకులను తయారు చేసి వాటిని మావోయిస్టులకు పంపుతున్నారని పేర్కొన్నారు. నూతన సాంకేతికతను ఉపయోగంచి సీపీఐ మావోయిస్టు పార్టీ యువకులను రిక్రూట్​మెంట్ చెసినట్లు ఎన్ఐఏ పేర్కొంది.

మావోయిస్టులతో సంబంధాల కేసు... ముగ్గురి అరెస్ట్.. ఇంతకీ ఏం తేలిందంటే?

NIA investigating CPI( Maoists) Case : అధిక కాలం పాటు భారత ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఉద్దేశంతో వివిధ రకాల చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వామపక్ష తీవ్రవాద సంస్థ సీపీఐ (మావోయిస్ట్) పాల్పడుతున్నదని ఎన్​ఐఏ తెలిపింది. ఈ సంస్థకి లాజిస్టిక్ మద్దతును అందించడంలో నిందితుడి ప్రమేయాన్ని తెలుసుకునేందుకు.. స్వాధీనం చేసుకున్న పరికరాలు, పత్రాలు ఉపయోగపడతాయని.. వాటని వివరణాత్మక పరిశీలన జరుగుతోందని ఎన్​ఐఏ ప్రకటించింది. నిషిద్ధ సంస్థకు భారతదేశ వ్యతిరేక ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిందితులు ప్రాథమికంగా ముడిసరుకును అందించారని పేర్కొంది. ఈ సంస్థ ఇటీవలి కాలంలో, వివిధ రాష్ట్రాల్లో తన హింసాత్మక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆధునిక సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ప్రారంభించిందని వెల్లడించింది. ఇతర భద్రతా సంస్థలతో పనిచేస్తున్న స్థానిక పోలీసులు జూన్​ నెలలో పేలుడు పదార్థాలు తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. దేశంలో అంతర్​రాష్ట్ర భద్రతా పరమైన అంశాల దృష్ట్యా ఈ కేసును ఎన్​ఐఏకి బదిలీ చేశారు. అప్పటి నుంచి ఎన్​ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగించారు.

NIA Raids in Karimnagar Today : కరీంనగర్‌లో NIA అధికారుల సోదాలు.. అతడి కోసం గాలింపు..!

ఆ నలుగురు పీఎఫ్​ఐ నిందితులను ప్రశ్నిస్తున్న ఎన్​ఐఏ

హైదరాబాద్​లో ఉగ్రదాడికి కుట్ర.. చార్జ్​షీట్​ దాఖలు చేసిన ఎన్​ఐఏ

Last Updated : Sep 9, 2023, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details