తెలంగాణ

telangana

Hi-tension in Huzurnagar: ఇందిరాగాంధీ విగ్రహాన్ని తొలగింపు... హుజూర్‌నగర్‌లో ఉద్రిక్తత

By

Published : Dec 24, 2021, 12:40 PM IST

Hi-tension in Huzurnagar

Hi-tension in Huzurnagar: హుజూర్‌నగర్‌ రహదారి విస్తరణలో స్వల్పఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ సీఎం వైఎస్​ఆర్​ విగ్రహాలను అధికారులు తొలగించడంతో కాంగ్రెస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు. ఎట్టిపరిస్థితుల్లో విగ్రహాలు తొలగించవద్దంటూ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

Hi-tension in Huzurnagar: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ రహదారి విస్తరణలో స్వల్పఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఇందిరాసెంటర్‌లోని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాలను అధికారులు తొలగించారు. ఎలాంటి సమాచారం లేకుండానే విగ్రహాలను తొలగిస్తున్నారంటూ అక్కడకుచేరుకున్న కాంగ్రెస్‌ నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఎట్టిపరిస్థితుల్లో విగ్రహాలు తొలగించవద్దంటూ... రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు విగ్రహాల తొలగింపును అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకొని మేళ్లచెరువు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి:Monkeys Attack on people : మితిమీరిన కోతుల ఆగడాలు.. చెట్లు నరికేస్తున్న ప్రజలు

ABOUT THE AUTHOR

...view details