ETV Bharat / state

కాళేశ్వరంపై విచారణలో కమిషన్​కు సాయమందించేందుకు మూడు బృందాలు - త్వరలో నియామకం - Judicial Inquiry On Kaleshwaram

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 7:29 PM IST

Judicial Inquiry On Kaleswaram
Judicial Inquiry On Kaleswaram

Judicial Inquiry On Kaleswaram : కాళేశ్వరం ఎత్తిపోతల ఆనకట్టలపై విచారణలో తమకు సాయం అందించేందుకు వీలుగా న్యాయ, సాంకేతిక, ఆడిటింగ్ బృందాలను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియమించుకోనుంది. వారి నుంచి అవసరమైన సహాయం తీసుకుంటూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలకు విచారణ చేయనున్నారు.

Judicial Inquiry On Kaleswaram : సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై విచారణ కొనసాగించనుంది. కమిషన్ కు అవసరమైన సాయం అందించేందుకు వీలుగా న్యాయ, సాంకేతిక, ఆడిటింగ్ బృందాలను నియమించుకోనున్నారు. ఇద్దరు న్యాయవాదులు, ఇంజినీరింగ్ నిపుణులతో కూడిన సాంకేతిక బృందం, ఆడిటింగ్ బృందాల నియామకం త్వరలో జరగనుంది. వారి నుంచి అవసరమైన సహాయ, సహకారాలు తీసుకుంటూ జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేయనున్నారు.

1 Month Deadline For Submission Of Affidavits : అఫిడవిట్ల రూపంలో సాక్ష్యాధారాలను సమర్పించేందుకు ప్రజలకు మే నెలాఖరు వరకు కమిషన్ గడువిచ్చింది. ఇందుకోసం మూడు ఆనకట్టలకు విడిగా, ఉమ్మడిగా ఒకటి మొత్తం నాలుగు బాక్సులను కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్ లో ఏర్పాటు చేశారు. మొదటి దఫా పర్యటన ముగించుకొని జస్టిస్ పీసీఘోష్ ఇవాళ తిరిగివెళ్లారు. నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ తో సమావేశమైన ఆయన సంబంధిత అంశాలు, విచారణ ప్రక్రియపై చర్చించారు.

Justice PC Ghose Committee Visit : వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో జస్టిస్ ఘోష్ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఆ పర్యటనలో మేడిగడ్డ ఆనకట్టను సందర్శించడంతో పాటు హియరింగ్స్ చేపట్టనున్నారు. ఇప్పటికే కొందరికి కమిషన్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, అధికారులతో పాటు ఆనకట్టల పనులు చేసిన గుత్తేదార్లు, సంబంధిత వ్యక్తులను మొదటి దశలో కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ప్రజల నుంచి ఏవైనా ఫిర్యాదులు, నివేదనలు వస్తే పరిశీలించి వాటి ఆధారంగా కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు.

సాక్ష్యాలు పరిశీలించాక ఎవర్ని విచారణకు పిలవాలో నిర్ణయిస్తాం : జస్టిస్ పీసీ ఘోష్ - Justice PC Ghose On Kaleshwaram

Nodal Team : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఎత్తిపోతల ఆనకట్టలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే విచారణ మొదలైంది. రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి వచ్చిన కమిటీ నీటి పారుదలశాఖ అధికారులతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కమిషన్ కోరింది. కమిషన్​కు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు 9 మందితో కూడిన నోడల్ బృందాన్ని నియమిస్తూ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు ఇచ్చారు.

'గుత్తేదారు స్పందించకపోతే - అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు' - Judicial Inquiry On Kaleshwaram

మేడిగడ్డ ఆనకట్టలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ - ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు - Judicial Inquiry on Kaleshwaram

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.