తెలంగాణ

telangana

మహిళ పొట్టలో కత్తెర.. ఆరేళ్లక్రితం ఆపరేషన్​ చేసి మర్చిపోయిన వైద్యులు

By

Published : Feb 25, 2023, 9:32 PM IST

Scissor in woman stomach for six years: పెద్దపల్లి జిల్లాలోని ఓ ప్రైవేట్​​ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఆరేళ్లుగా ఓ మహిళ నరకం అనుభవిస్తోంది. ఆరు సంవత్సరాల కిందట సిజేరియన్​ కోసమని ఆసుపత్రికి వెళ్తే వైద్యులు ఆమె పొట్టలో కత్తెర మరిచి కుట్లు వేశారు. దీంతో చాలా రోజులుగా ఆమె కడుపు నొప్పితో బాధపడగా.. స్కానింగ్​ చేసి చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Scissors in woman stomach for six years
Scissors in woman stomach for six years

Scissors in woman stomach for six years: ఆపరేషన్​లు చేసి కడుపులో సెల్​ఫోన్​లు మరిచిపోవడం, చిప్​లు పెట్టి వారిని ట్రాక్​ చేయడం ఈ మధ్య వస్తున్న సినిమాల్లో చూస్తున్నాం. అంతే కాదు మహిళలకు ప్రసవం సమయంలో ఆపరేషన్​లు చేసి వారి కడుపులో కత్తెరలు, గ్లౌజ్​లు, బ్లేడ్​లు మరిచిపోవడం కూడా సినిమాల్లో చూసే ఉంటాం.. కానీ అది రీల్​ లైఫ్​ మూడు గంటల ముచ్చట.. ఎలాగైనా నడుస్తోంది. కానీ రియల్​ లైఫ్​లో మాత్రం సినిమాల సన్నివేశాలు తలపించేలా ప్రవర్తించారు.. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్​ ఆసుపత్రి వైద్యులు. వారి నిర్లక్ష్యం కారణంగా గత ఆరేళ్లుగా ఓ మహిళ నరకం అనుభవిస్తోంది. ప్రసవానికి వచ్చినప్పుడు వైద్యులు పొట్టలో కత్తెరను మరిచిపోయి కుట్లు వేయడంతో ఆ మహిళ ఇప్పుడు నరకయాతన అనుభవిస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్​ ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఇది జరిగింది:2017వ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్‌ చేసిన వైద్యులు పొట్టలో కత్తెరను మరిచిపోయారు. దీంతో గత ఆరేళ్లుగా ఆమె కడుపు నొప్పితో బాధపడుతోంది. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది బాధ ఎక్కువ కావడంతో.. భరించలేని స్థితిలో తన కడుపు నొప్పికి గల కారణం ఏంటో తెలుసుకొందామని పెద్ద ఆసుపత్రిలో చేరింది.

మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఆమెకు స్కానింగ్ చేయగా.. పొట్టలో కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ మహిళతో పాటు కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఆమెకు శస్త్రచికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. దీంతో వారు ఏం చేయాలో తెలియక సమాచారం బయటకు వెళ్లకుండా పొట్టలోని కత్తెరను తీసేందుకు ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించింది. స్కానింగ్​కు సంబంధించిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కాగా ఆ జిల్లాలో ఇది హాట్​ టాపిక్​గా మారింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details