తెలంగాణ

telangana

Congress Leader Son Killed his Wife : భార్య హత్య.. ఆపై సాక్ష్యాల చెరిపివేతకు యత్నం.. యూత్​ కాంగ్రెస్​ లీడర్ అరెస్ట్

By

Published : Jul 29, 2023, 5:07 PM IST

Updated : Jul 29, 2023, 5:25 PM IST

Youth Congress Leader Wife Murder Case : భార్యను హత్య చేసి.. సాక్ష్యాలు చెరిపేసేందుకు యత్నించిన కేసులో యూత్​ కాంగ్రెస్​ లీడర్​ వల్లభ్​రెడ్డిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడిపై సెక్షన్ 201, 302 కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

Congress Leader Son Killed his Wife
Congress Leader Son Killed his Wife

Congress Leader Son Killed his Wife : భార్య హత్య.. ఆపై సాక్ష్యాల చెరిపివేతకు యత్నం.. యూత్​ కాంగ్రెస్​ లీడర్ అరెస్ట్

Youth Congress Leader Vallabh Reddy Arrest : ఓ రాజకీయ నేత కుమారుడు పెళ్లైన ఏడాదికే భార్యను హత్య చేశాడు. ఆపై.. గుండెపోటుతో చనిపోయినట్లు అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. తనకున్న రాజకీయ పలుకుబడితో హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించాడు నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్​రెడ్డి. శవ పరీక్ష నివేదికలో అసలు విషయం బయటపడటంతో కటకటాల పాలై.. ఊచలు లెక్కబెడుతున్నాడు. నారాయణగూడ సీఐ శ్రీనివాస్​ తెలిపిన వివరాల ప్రకారం..

Congress Leader Arrested in Wife's Murder Case : నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్​ నేత రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభ్​రెడ్డి (29) ప్రస్తుతం యూత్​ కాంగ్రెస్​ లీడర్​గా కొనసాగుతున్నాడు. ఇతడికి సంవత్సరం కిందట లహరి (27) అనే అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు హైదరాబాద్​లోని హిమాయత్​నగర్​లో కాపురం పెట్టారు. అంతా సవ్యంగానే సాగుతుండగా.. ఈ నెల 14న లహరి ఇంట్లో కళ్లు తిరిగి కింద పడిపోయింది. తలకు గాయాలు కావడంతో వల్లభ్​రెడ్డి ఆమెను దగ్గరలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించాడు. అనంతరం లహరి తండ్రి జైపాల్​రెడ్డికి సమాచారం అందించాడు. ఆయన హాస్పిటల్​కు వచ్చేలోగా.. చికిత్స పొందుతున్న లహరి కన్నుమూసింది. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే పోస్టుమార్టం నివేదికలో లహరి శరీరంలో గాయాలు ఉన్నట్లుగా తేలడంతో ఈ నెల 26న వల్లభ్​రెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్​లో విచారించారు. దాంతో అతడు అసలు విషయం చెప్పేశాడు.

అసలు ఆరోజు ఏమైందంటే..? ఈ నెల 13న రాత్రి.. 14వ తేదీ ఉదయం వల్లభ్​రెడ్డి, లహరి దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన వల్లభ్​.. లహరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తల, పొత్తి కడుపు భాగంలో దెబ్బలు బలంగా తాకడంతో లహరి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించి..గుండెపోటుతో మరణించినట్లుగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు హత్యగా తేలడంతో నారాయణగూడ పోలీసులు హత్య, సాక్ష్యాలు చెరిపేసినట్లుగా నిర్ధారించి సెక్షన్ 201, 302 కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ఈ నెల 14న ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మాకు ఫోన్​ వచ్చింది. లహరి అనే ఓ వివాహిత మృతిపై అనుమానాలున్నాయని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాం. పోస్టుమార్టం రిపోర్టులో లహరి శరీరంలో గాయాలున్నట్లు తేలింది. దీంతో ఆమె భర్త వల్లభ్​రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్య చేసినట్లుగా అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించాం.-శ్రీనివాస్​, నారాయణగూడ సీఐ

మరోవైపు.. తమ కుమార్తె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, లహరిది సహజ మరణమేనని ఆమె తండ్రి చెబుతున్నారు. తన అల్లుడు నిర్దోషి అని.. పోలీసులకు తాను ఇచ్చిన ఫిర్యాదులోనూ ఇవే విషయాలు చెప్పానని అంటుండటం గమనార్హం.

ఇవీ చూడండి..

Attack on Forest Officer in Adilabad : అటవీ అధికారిపై గొడ్డలితో దాడి చేసిన తండ్రీకుమారులు.. అదే కారణం!

One Person Killed in Two Gangs Clash : బోనాల వేళ ఫ్లెక్సీల రగడ.. ఇరువర్గాల పరస్పర దాడులు.. ఒకరు మృతి

Last Updated : Jul 29, 2023, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details