తెలంగాణ

telangana

గవర్నర్​ను కలిసిన ఎమ్మెల్యే సీతక్క.. ఆ విషయంపై విజ్ఞప్తి

By

Published : Sep 24, 2022, 2:59 PM IST

Seethakka
Seethakka

Seethakka met governor: 2014 రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన విశ్వవిద్యాలయం పరిస్థితి దారుణంగా ఉందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఈ మేరకు రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళసై సౌందర్యరాజన్​ని కలిసిన సీతక్క.. కేంద్రం చొరవతో విశ్వవిద్యాలయాన్ని వేగంగా నిర్మించాలని కోరారు.

Seethakka met the governor for probalams of tribal university: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో గిరిజన విశ్వవిద్యాలయం పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ములుగులో భూమి కేటాయించినప్పటికీ విశ్వవిద్యాలయం ఇంకా నోచుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హమీ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు గిరిజన విశ్వవిద్యాలయల ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.. ఏపీలో ఇప్పటికే ప్రారంభం కాగా మన రాష్ట్రంలో దాని ప్రసక్తే లేవనేత్తలేదని ఆమె అన్నారు.

రాజ్ భవన్​లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను కలిసిన సీతక్క.. గిరిజన విశ్వవిద్యాలయం అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మేడారం పర్యటనకు వచ్చిన సందర్భంలో గవర్నర్​కు వివరించానని, మరోమారు తమిళిసై దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. ఎనిమిదేళ్లు గడచినప్పటికీ విశ్వవిద్యాలయం మందుకెళ్లకపోవడంతో గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని సీతక్క అన్నారు. విశ్వవిద్యాలయం పూర్తి అయితే ఇప్పటికే పర్యాటక రంగంలో ముందున్న ములుగు ఎడ్యుకేషన్ హబ్​గా మారుతుందని ఆశభావం వ్యక్తం చేశారు.

గవర్నర్​ని కలిసిన సీతక్క.. గిరిజన యూనివర్సిటీ వేగవంతం చేయాలని వినతి

"2014 రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన విశ్వవిద్యాలయం.. ఇంతవరకు నాయకులు దానిని పట్టించుకోలేదు. ములుగులో భూమి కేటాయించినప్పటికీ విశ్వవిద్యాలయం ఇంకా నోచుకోలేదు. ఏపీలో ఇప్పటికే ప్రారంభం కూడా అయిపోయింది. గవర్నర్​ని కలిసి ఇదే విషయం ఈరోజు వివరించా.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను వేగంగా పరిష్కరించమని కోరా.. ఇప్పటికే ములుగు పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటైతే ఎడ్యుకేషన్​ హబ్​గా మారుతుంది."- సీతక్క, ములుగు ఎమ్మెల్యే.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details