తెలంగాణ

telangana

Harish Rao Fires on Congress : 'కాంగ్రెస్‌, బీజేపీలది మేకపోతు గాంభీర్యం.. దరఖాస్తులు అమ్ముకునే హస్తం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నీ అమ్మేస్తుంది'

By

Published : Aug 19, 2023, 7:59 PM IST

Updated : Aug 19, 2023, 8:29 PM IST

Harish Rao Comments on Congress and BJP : కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలది మేకపోతు గాంభీర్యమని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హస్తం పార్టీకి లీడర్లు లేరని.. కమలం పార్టీకి క్యాడర్ లేదని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. రాష్ట్రంలో మరోసారి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీశ్​రావు పునరుద్ఘాటించారు.

Etv Bharat
Etv Bharat

Harish Rao Fires on Congress కాంగ్రెస్‌, బీజేపీలది మేకపోతు గాంభీర్యం

Harish Rao Latest News : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థుల కోసం దరఖాస్తులు అమ్ముతోందని.. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నీ అమ్ముతుందని మంత్రి హరీశ్​రావు ఎద్దేవా చేశారు. హస్తం పార్టీకి తెలంగాణలో 35 నుంచి 40 స్థానాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని (Harish Rao Fires on Congress) విమర్శించారు. ఎన్నికలప్పుడు మాత్రమే వారికి ప్రజలు గుర్తుకు వస్తారని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక.. అక్కడి రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Harish Rao Comments on Congress and BJP :కాంగ్రెస్​కు లీడర్లు లేరని.. బీజేపీకి క్యాడర్ లేదని హరీశ్​రావు (Harish Rao Comments on Congress and BJP) విమర్శించారు. ఈ క్రమంలోనే బీఆర్​ఎస్​కు తిరుగు లేదని అన్నారు. రాష్ట్రంలో కమలం పార్టీ పని అయిపోయిందని.. ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకోవడం కోసమే ఆ పార్టీ ఆరాటమని అన్నారు. ఆ రెండు పార్టీలు రైతులు, మహిళలు, యువకుల దగ్గరికి వెళ్లి ఓట్లడిగే పరిస్థితి లేదని విమర్శించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని.. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని హరీశ్​రావుధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులకు.. రూ.20,000 కోట్ల రుణమాఫీ చేసినట్టు హరీశ్​రావు తెలిపారు. ఇప్పటికే రూ.99,999లోపు రుణాలన్నీ మాఫీ అయ్యాయని చెప్పారు. త్వరలోనే రూ.లక్షకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని ​వెల్లడించారు. కొందరి అకౌంట్ పని చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అకౌంట్ ఆపరేషనలైజ్‌ చేసి మాఫీ చేస్తామని ఈ విషయంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని హరీశ్​రావు చెప్పారు.

''టికెట్లు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉంది. నాయకులు లేకపోవడం వల్లే కాంగ్రెస్‌ దరఖాస్తులు తీసుకుంటుంది. 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు. రుసుము వసూలు చేసి కాంగ్రెస్‌ దరఖాస్తులు అమ్ముతుంది. దరఖాస్తులు అమ్ముకునే పార్టీ.. రాష్ట్రాన్నీ అమ్మేస్తుంది. కాంగ్రెస్‌, బీజేపీది మేకపోతు గాంభీర్యం. మరోసారి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పటికే రూ.99,999లోపు రుణాలు మాఫీ చేశాం. రూ.లక్షపైన ఉన్న రుణాల మాఫీ త్వరలో చేస్తాం. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు. అకౌంట్ పని చేయకుంటే.. అకౌంట్ ఆపరేషనలైజ్‌ చేసి మాఫీ చేస్తాం.'' - మంత్రిహరీశ్‌రావు

23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన..: ఈ క్రమంలోనే ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్​ జిల్లాలో పర్యటిస్తారని హరీశ్​రావు తెలిపారు. ఈ సందర్భంగా సమీకృత​ కలెక్టరేట్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం​, బీఆర్ఎస్​ పార్టీ ఆఫీస్​ను​ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది కేసీఆర్ మాత్రమేనని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ జిల్లాకు అన్ని వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ఈ ప్రాంతానికి మెడికల్​ కాలేజీ మంజూరు చేశామని, వచ్చే నెలలో ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ మొదలవుతుందని హరీశ్​రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి , ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Harish Rao Tour in Rangareddy District : 'దీపం లాంటి కేసీఆర్‌ ఉంటుండగా.. కాంగ్రెస్‌, బీజేపీ కావాలా?'

Harish Rao Fires on BJP Leaders : 'కేసీఆర్​ పట్టుబట్టి కాళేశ్వరం కడితే.. బీజేపీ తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది'

Last Updated : Aug 19, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details