NRI Missing Vote in Mancherial District: పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. వలస వెళ్లిన వారంతా స్వస్థలాలకు తిరిగి రావడంతో బస్సులు, రోడ్లు కిక్కిరిసి పోయాయి. చాలా మంది హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వెళ్లారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనకు ఓటు హక్కు ఉందో.. లేదని చెక్ చేసుకుని ఉందని నిర్ధారించుకున్నాక ఏకంగా సప్తసాగరాలు దాటి వచ్చాడు.
న్యూజిలాండ్ నుంచి తెలంగాణకు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. పోలింగ్ బూత్ అధికారి జాబితాలో తన ఓటు లేదని చెప్పగానే అవాక్కయ్యాడు. ఇలా ఎందుకు జరిగిందని చూస్తే.. తాను ఓటు ఉందని తెలుసుకున్న జాబితా పాతదని.. కొత్తదాంట్లో తన ఓటు తొలగించారనే విషయం అర్ధమయింది. దీంతో అంత దూరం నుంచి వచ్చినా.. ఓటు వేయలేక పోయానే అని బాధ పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
తెలంగాణలో 70.66% పోలింగ్ - మళ్లీ పట్నం బద్ధకించింది - పల్లె ఓటెత్తింది
Telangana Assembly Elections Polling 2023: బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ గత 15 సంవత్సరాలుగా న్యూజిలాండ్లో నివసిస్తున్నాడు. అక్కడ ఓ కంపెనీలో వెల్డర్గా పని చేస్తున్నాడు. ఎన్నికల దృష్ట్యా.. ఓటు హక్కును వినియోగించుకోవాలని.. తల్లిదండ్రులతో కొన్ని రోజులు గడుపుదామని అతని భార్య లావణ్యతో వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. తన మిత్రుడు ఓటరు జాబితాను వాట్సాప్లో పంపగా.. తన పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకున్నాడు.