పట్టణ ప్రాంతాల్లో పోలింగ్​ పుంజుకుంటుందని ఆశిస్తున్నాను : వికాస్​ రాజ్​

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 2:47 PM IST

thumbnail

Vikash Raj on Telangana Election Polling : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని.. సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు. కొన్నిచోట్ల స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతం జరుగుతోందని.. పట్టణ ప్రాంతాల్లోనూ పోలింగ్‌ పుంజుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సుమారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్​ ప్రక్రియ(Polling Process in Telangana) కొనసాగుతోందని అన్నారు.  సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకు ఓటింగ్​ వేయవచ్చని.. మిగిలిన చోట ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Telangana Assembly Elections polling 2023 : ఓటు వేసే వ్యక్తి దగ్గర గుర్తింపు కార్డు లేకపోతే.. ఈసీ తెలిపిన 12 కార్డుల్లో ఏదొకటి చూపించి వేయవచ్చని వికాస్​రాజ్​ సూచించారు. కొన్ని పోలింగ్​ కేంద్రాల్లో స్వల్ప ఉద్రిక్తతలు జరిగాయని.. వెంటనే అదుపు చేశామని అన్నారు. పోలింగ్​ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత(FIR on MLC Kavitha) ప్రచారం చేశారని ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీంతో కవితపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైనట్లు వెల్లడించారు. మరికొన్ని ఫిర్యాదులను కూడా డీఈవోలకు పంపామని స్పష్టం చేశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.