తెలంగాణ

telangana

మాస్క్​ ధరించకపోవడంపై జరిమానా.. మహిళ ధర్నా

By

Published : Dec 6, 2020, 5:55 AM IST

మాస్క్​ ధరించలేదంటూ అధికారులు జరిమానా విదించడంపై ఓ మహిళ ఆందోళనకు దిగింది. కారులో వెళ్తున్నవారికి మాస్క్​ ఏంటిని నిలదీసింది. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా కురవిలో జరిగింది.

mahabubabad news
మాస్క్​ ధరించకపోవడంపై జరిమానా.. మహిళ ధర్నా

కారులో వెళ్తున్న వారికి మాస్క్​లేదని జరిమానా విధించడాన్ని నిరసిస్తూ ఓ మహిళ రోడ్డుపైనే బైఠాయించింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవిలో జరిగింది. వాహనంలో వెళ్తున్న వారికి జరిమానా ఎలా విధిస్తారంటూ కారులోని వారు నిరసన తెలిపారు. రోడ్డుపై వాగ్వివాదానికి దిగడంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి.

మాస్క్​ ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించాలన్న కలెక్టర్ ఆదేశాలతో చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గంట తర్వాత రూ.500 జరిమానా చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇవీచూడండి:మాస్క్‌ ధరించనని మొండిపట్టు.. చివరకు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details