తెలంగాణ

telangana

HUZURABAD BYPOLL: పార్టీ ఆదేశిస్తే హుజూరాబాద్​లో​ పోటీ చేస్తా: కాంగ్రెస్​ విద్యార్థి విభాగం అధ్యక్షుడు

By

Published : Oct 1, 2021, 7:50 PM IST

హుజూరాబాద్​ ఉపఎన్నికల ప్రచారంలో తెరాస, భాజపా దూసుకుపోతుండగా.. కాంగ్రెస్​ మాత్రం ఎప్పటిలానే అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. పలుమార్లు సమావేశాలు నిర్వహిస్తున్నా.. అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకోలేకపోతోంది. హుజూరాబాద్​ ఉపఎన్నికల (HUZURABAD BYPOLL) అభ్యర్థిత్వంపై తన అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం అడిగినట్లు ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్​ తెలిపారు. పార్టీ ఏం చేయమంటే అదే చేస్తానని.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వెంకట్​ స్పష్టం చేశారు.

NSUI TELANGANA PRESIDENT
NSUI TELANGANA PRESIDENT

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల్లో (HUZURABAD BYPOL)పోటీపై తన అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం అడిగినట్లు ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు (NSUI TELANGANA PRESIDENT)బ‌ల‌మూరి వెంక‌ట్ తెలిపారు. పార్టీ నిర్ణయ‌మే త‌న‌కు శిరోధార్యమ‌ని చెప్పానన్న వెంక‌ట్.. ఏ నిర్ణయం తీసుకున్నా తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని స్పష్టం చేశారు. తాను ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందినవాడినైనందున.. అభ్యర్థి ఎంపికలో తన అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం సేకరించినట్లు భావిస్తున్నానన్నారు. పార్టీ పోటీ చేయమంటే పోటీచేస్తానన్నారు.

హుజూరాబాద్‌లో బ‌ల‌మైన అభ్యర్థిని బ‌రిలో దించాల‌ని యోచిస్తున్న కాంగ్రెస్.. గ‌త నెల రోజులుగా వేట కొన‌సాగిస్తున్నా.. ఎవరు పోటీలో ఉంటారనే దానిపై ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. విడ‌త‌ల వారీగా సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, పీసీసీ ఎన్నిక‌ల నిర్వహ‌ణ క‌మిటీ ఛైర్మన్ దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌.. స్థానిక నాయకత్వంతో పలుమార్లు చర్చించినా.. తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఏఐసీసీకి పంపిన పేర్లపై హైకమాండ్​ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

పార్టీ ఆదేశిస్తే హుజూరాబాద్​లో​ పోటీ చేస్తా: కాంగ్రెస్​ విద్యార్థి విభాగం అధ్యక్షుడు

నేడైనా తేలేనా..

దీనిపై రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్​, పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క, స్థానిక నాయ‌కులు స‌మావేశ‌మ‌య్యే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో అభ్యర్థి ఎంపిక‌పై తుది నిర్ణయానికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువ‌జ‌న కాంగ్రెస్ రాష్ట్ర కార్యద‌ర్శి తిప్పర‌పు సంప‌త్‌, కిసాన్ కాంగ్రెస్ క‌రీంన‌గ‌ర్ జిల్లా అధ్యక్షుడు ప‌త్తి కృష్ణారెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బ‌ల‌మూరి వెంక‌ట్​.. పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మాణిక్కం ఠాగూర్ కూడా హైద‌రాబాద్‌లోనే ఉండ‌డంతో అభ్యర్థి ఎంపిక‌పై.. స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈనెల 30న ఎన్నికలు..

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ రాజీనామాతో హుజూరాబాద్​లో ఉపఎన్నిక అనివార్యమైంది. తెరాస తరఫున బరిలో నిలిచిన గెల్లు శ్రీనివాస యాదవ్​.. ఇవాళ తన నామినేషన్​ వేశారు. భాజపా తరఫున ఈటల అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్​ మాత్రం తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. హుజూరాబాద్​ ఉపఎన్నికల పోలింగ్​ అక్టోబర్ 30న జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.

పోటాపోటీగా తెరాస, భాజపా ప్రచారం

తెరాసను వీడి భాజపాలో చేరిన ఈటల రాజేందర్​.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రతో పాటు ప్రజల దీవెనలు పొందేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెరాసపై విమర్శ బాణాలు ఎక్కు పెడుతూ ప్రచారం (Huzurabad By Election Campaign 2021)లో జోరు సాగిస్తున్నారు. ఆయనతో పాటు సతీమణి జమున కూడా ప్రచారాల్లో హోరెత్తిస్తున్నారు. గులాబీదళంపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ.. తన భర్త ఈటల... నియోజకవర్గానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈటలను ఢీ కొట్టేందుకు తెరాస అధిష్ఠానం అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్(huzurabad by election 2021) బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. కొన్ని నెలలుగా నియోజకవర్గంలోనే ఉంటూ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీచూడండి:Huzurabad by election: హుజూరాబాద్‌ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

ABOUT THE AUTHOR

...view details