తెలంగాణ

telangana

SRSP Land grabbing: ఎస్సారెస్పీలో భూ దందా.. పరిశీలించకుండానే లేఅవుట్‌ అనుమతులు

By

Published : May 10, 2022, 5:17 AM IST

Updated : May 10, 2022, 6:38 AM IST

SRSP Land grabbing
SRSP Land grabbing

SRSP Land grabbing: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని లేఅవుట్లకు అనుమతివ్వాలని ఏర్పాటు చేసిన శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ.. అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. సర్కారు భూముల్ని ఆక్రమించేందుకు స్థిరాస్తి వ్యాపారి ప్రయత్నించగా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే సూడా అనుమతిచ్చింది. లేఅవుట్‌కు సూడా అనుమతివ్వడం వివాదస్పదంగా మారగా... పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

SRSP Land grabbing: కరీంనగర్‌ శివారు ప్రాంతాల్లో భూములకు డిమాండ్ బాగా పెరగడంతో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో భవిష్యత్‌ అవసరాలను గుర్తించి లేఅవుట్‌లకు అనుమతివ్వాలని ప్రభుత్వం శాతావాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. కరీంనగర్‌ చుట్టుపక్కల 72 గ్రామాలను సూడా పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో నగునూరులో లేఅవుట్‌కు సూడా అనుమతిచ్చిన విధానం పోలీసులకు ఫిర్యాదు చేసే స్థాయికి చేరింది. స్థిరాస్తి వ్యాపారులు తమ లేఅవుట్‌ ఆమోదం పొందాలంటే ఆ వెంచర్‌కు కనీసం 40 అడుగుల రహదారిని చూపాల్సి ఉంటుంది. నగునూరులోని ఓ స్థిరాస్తి వ్యాపారి.. శ్రీరాంసాగర్‌ డీ-93 కాల్వ స్థలాన్ని రోడ్డుగా చూపుతూ లేఅవుట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు తగ్గట్లుగా సూడా అధికారులు కూడా ఎలాంటి తనిఖీలు చేయకుండానే లేఅవుట్‌కు అనుమతిచ్చారు.


ఈ భూమి కోసం స్థిరాస్తి వ్యాపారి ముందుగా కొందరు రైతులతో కలిసి పొలాలకు తాత్కాలిక రోడ్డు కావాలంటూ దరఖాస్తు చేయించాడు. అన్నదాతల కోసం నీటిపారుదలశాఖ అధికారులు తాత్కాలిక రోడ్డుకు అనుమతిచ్చారు. అయితే తారు రోడ్డు వేస్తుండడంతో అనుమానించిన అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఆరా తీశారు. విచారణలో కొంతమంది రైతులు స్థిరాస్తి వ్యాపారులతో కలిసి రోడ్డు ప్రణాళిక రూపొందించారని తేలడంతో వెంటనే గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేశారు.

ఎస్సారెస్పీలో భూ దందా.. పరిశీలించకుండానే లేఅవుట్‌ అనుమతులు

సుడా పరిధిలోని గ్రామాల్లో కొత్తగా అనుమతిచ్చే లేఅవుట్లలో గ్రామపంచాయతీ ప్రమేయం ఉండకపోవడం నష్టాలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కబ్జా వల్ల 36 ఎకరాల ఆయకట్టుకు అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఎస్​ఆర్​ఎస్పీ కాలువను ధ్వంసం చేసి రహదారిని నిర్మించడం వల్ల... రైతులకు అన్యాయం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండానే గతంలో పనిచేసిన సుడా ఛైర్‌పర్సన్‌ అనుమతించారని నీటిపారుదల శాఖ ఏఈ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలు రకాలుగా ఈ భూకబ్జాను అడ్డుకొనేందుకు యత్నించిన నీటిపారుదలశాఖ అధికారులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు.

ఇవీ చూడండి:Accident CCTV Footage: డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు కింద పడి చిన్నారి దుర్మరణం

దివ్యాంగ చిన్నారికి విమానంలో నో ఎంట్రీ.. కేంద్రమంత్రి ఫైర్.. దిగొచ్చిన ఇండిగో!

Last Updated :May 10, 2022, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details