తెలంగాణ

telangana

zero covid cases in Telangana : రాష్ట్రంలో తొలిసారిగా జీరో కొవిడ్​ కేసులు

By

Published : Jan 28, 2023, 8:15 AM IST

zero covid cases in Telangana : మూడేళ్లుగా కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని అట్టుడికించింది. ఎట్టకేలకు నెమ్మదిగా శాంతించినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర వైద్యాధికారులు ఇటీవల చేసిన కరోనా నిర్ధరాణ పరీక్షల్లో అందరికి నెగిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడేళ్ల తర్వాత జీరో కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ ప్రకటించింది.

Covid
కరోనా

zero covid cases in Telangana : రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కరోనా కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2020 మార్చిలో మొట్ట మొదటిసారి రాష్ట్రంలో కోవిడ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ తరువాత మూడు వేవ్‌లుగా కోవిడ్ ప్రజలను వణికించింది.వేల మందిని బలితీసుకుంది. ఇక 2022లో కోవిడ్ పెద్దగా ప్రభావం చూపకపోయినా చైనాలో పెరిగిన కేసులు ఆందోళన కలిగించాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జీరో కేసులు నమోదు కావడంపై వైద్య ఆరోగ్య శాఖ హర్షం వ్యక్తం చేసింది. తాజాగా 3,690 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్టంలో కేవలం 19 మందికి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. కొవిడ్​ నిబంధనలు పాటించాలన ప్రభుత్వం తెలిపింది.

చైనాలో కొవిడ్​ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ నియమాలు పాటించమని ప్రజలు అందరికి ఇటీవలే తెలియజేశాయి. కొవిడ్​ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు ఇచ్చాయి. దేశంలో కొవిడ్​ని ఎదుర్కొడానికి ఈ మధ్య కాలంలో కొన్నింటి వ్యాక్సిన్​లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details