రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై గృహహింస, బాలికలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. బంగారు తెలంగాణ కాదని.. ప్రస్తుతం రాష్ట్రంలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో మహిళాలపై జరుగుతున్న హింసపై భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వర్చువల్ రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలకు చెందిన మహిళ నేతలు.. జ్యోతి, సజయ, మల్లేశ్వరి, దేవి, సృజనతోపాటు పలువురు నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.