తెలంగాణ

telangana

సచివాలయ ప్రాంగణంలో మసీదు నిర్మాణానికి నేడు శంకుస్థాపన

By

Published : Nov 25, 2021, 6:09 AM IST

foundation

సచివాలయ ప్రాంగణంలో మసీదు నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్నారు. మసీదు నిర్మాణానికి ఇప్పటికే నమూనా ఖరారు చేయగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం చేయనున్నారు.

సచివాలయ ప్రాంగణంలో మసీదు నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్నారు. జామియా నిజామియా విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్‌ మౌలానా ముఫ్తీఖలీల్ అహ్మద్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌అలీ, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొననున్నారు.

మసీదు నిర్మాణానికి ఇప్పటికే నమూనా ఖరారు చేయగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం చేయనున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్నారు.

ఇదీ చూడండి:child death with vaccine: ఒకేసారి ఐదు టీకాలు.. మూణ్నెళ్ల చిన్నారి మృతి

ABOUT THE AUTHOR

...view details