తెలంగాణ

telangana

Murder Cases Telangana : కుటుంబ బంధాల్ని మంటగలిపేలా రాష్ట్రంలో హత్యాఘటనలు

By

Published : May 28, 2023, 8:01 PM IST

Updated : May 28, 2023, 8:08 PM IST

Murder cases in Telangana
Murder cases in Telangana

Murder Cases in Telangana : బంధాలు- అనుబంధాలు మరిచారు. మంచి- చెడుల విచక్షణ మర్చిపోయారు. ఆస్తి కోసం ఒకరు.. విభేదాలతో మరొకరు కారణాలేవైనా.. కుటుంబ బంధాల్ని మంట గలిపారు. సంగారెడ్డి జిల్లాలో భర్తపై భార్య డీజిల్‌ పోసి హత్యాయత్నానికి పాల్పడితే.. కామారెడ్డి జిల్లాలో సొంత తమ్ముడినే అన్న దారుణంగా హత్య చేశాడు. మరోవైపు నిజామాబాద్‌ జిల్లాలో కన్నతల్లినే కూతురు దారుణంగా చంపేసింది. రాష్ట్రంలో జరిగిన ఈ మూడు ఘటనలు మానవత్వానికి మాయని మచ్చగా మిగిలాయి.

Murder Cases in Telangana : నవ మాసాలు కని పెంచిన తల్లి కోసం ప్రాణాలైనా ఇస్తారు.. కన్న బిడ్డలు..! అన్నదమ్ముల్లో ఏ ఒక్కరికి ఏమైనా మరొకరు తల్లడిల్లిపోతారు. భర్త పదికాలాల పాటు ప్రాణాలతో ఉండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది. కానీ రాష్ట్రంలో జరిగిన పలు ఘటనల్లో బంధువులే హంతకులుగా మారారు. దారుణంగా హత్య చేసి కుటుంబ బంధాలకు మాయని మచ్చగా మిగిలారు.

Daughter killed her mother : నిజామాబాద్ జిల్లాలో కన్నతల్లినే కుమార్తె అత్యంత దారుణంగా కడతేర్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట్ మండలం ఉమ్మెడకు చెందిన నాగం నర్సు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోందని తెలిపారు. ఆమె భర్త 20ఏళ్ల క్రితం చనిపోవడంతో ఇంట్లో ఒక గదిలో ఒంటరిగా ఉంటోందని చెప్పారు. మరో గదిలో ఆమె పెద్ద కూతురు నాగం హరిత ఉంటుందని వివరించారు. తల్లీకూతుళ్ల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని చెప్పారు.

ఈ క్రమంలోనే ఈ నెల 26న నాగం నర్సు రెండో కూతురు ఇంట్లో జరిగిన ఫంక్షన్‌ విషయంపై.. పెద్ద కుమార్తె హరితతో తీవ్ర వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో హరిత, తల్లిపై రోకలి బండతో దాడిచేసి దారుణంగా హత్య చేసిందని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.

ఆస్తికోసం తమ్ముడిని చంపిన అన్న : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాలలో ఆస్తికోసం సొంత తమ్ముడిని.. అన్న కడతేర్చాడు. తమ్ముడు విజయ్‌పాటిల్‌ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. అన్న రాజు కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసినట్టు పోలీసులు తెలిపారు. అన్నదమ్ముల మధ్య కొంత కాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయని వెల్లడించారు. 10 ఏళ్ల క్రితం నిందితుడు.. తన పెద్దన్నను కూడా మహారాష్ట్రలో హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు తమ్ముడిని హతమార్చినట్లు వివరించారు. నిందితుడు రాజు హైదరాబాదులో ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

సంగారెడ్డి జిల్లాలో భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఓ భర్త నిలదీశాడు. దీంతో ఆమె.. అతడిని డీజిల్ పోసి చంపేందుకు యత్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జన్నారం మండలం ఊట్ల గ్రామానికి చెందిన నర్సింహులుపై భార్య యాదమ్మ శనివారం రాత్రి.. డీజిల్ పోసి నిప్పంటించి హత్యచేసేందుకు యత్నించింది. దీంతో అతనికి గాయాలయ్యాయి. ఎక్కడికి వెళ్తున్నావని భార్యను అడిగినందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించాడు.

రాష్ట్రంలో హత్యాఘటనలు

ఇవీ చదవండి :Murder: పెట్రోల్‌ పోసి నిప్పంటించి.. రాయితో కొట్టి.. సొంత తమ్ముడిని దారుణంగా చంపిన అన్న

Last Updated :May 28, 2023, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details