పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మట్టి వినాయకులను ప్రోత్సహించే సదుద్దేశంతో బుధవారం పశుసంక్షేమ శాఖ భవనం వద్ద మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. స్వాతి ప్రమోటర్స్ ఆధ్వర్యంలో సనత్నగర్ నియోజకవర్గంలో 10వేల మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని... పంపిణీ చేశారు.
వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందాం: మంత్రి తలసాని
హైదరాబాద్ సనత్నగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది పండుగలను వైభవంగా జరగడం లేదని.. వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందామని మంత్రి పేర్కొన్నారు.
![వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందాం: మంత్రి తలసాని minister talasani distributed clay ganesha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8473816-923-8473816-1597822344246.jpg)
వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందాం: మంత్రి తలసాని
కరోనా దృష్ట్యా ఈ ఏడాది పండుగలు వైభవంగా జరగడం లేదని మంత్రి అన్నారు. వచ్చే ఏడాది ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు.
ఇదీ చూడండి:కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!