తెలంగాణ

telangana

'అసలైన ఆట ఇప్పుడే మొదలైంది.. మరింత కసిగా పనిచేస్తాం'

By

Published : Nov 7, 2022, 2:14 PM IST

Kishan Reddy reaction on Munugode By Poll Result: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా ఎగిరింది. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా డిపాజిట్‌నే కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్పందించారు. మునుగోడులో నైతిక విజయం భాజపాదేనని తెలిపారు.

Kishan Reddy respond on Munugode By Poll Result
Kishan Reddy respond on Munugode By Poll Result

Kishan Reddy reaction on Munugode By Poll Result: మునుగోడు ఉపఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్పందించారు. మునుగోడులో నైతిక విజయం భాజపాదేనని స్పష్టం చేశారు. తాము ఎన్నికలో ఓడినా.. మునుగోడు ప్రజల నమ్మకాన్నిగెలిచామని అన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతో తెరాస గెలిచిందని ఆరోపించారు. మునుగోడులో డిపాజిట్ రాని పరిస్థితి నుంచి రెండో స్థానంలోకి వచ్చామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కల్వకుంట్ల కుటుంబానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైందని చెప్పారు. ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పనిచేస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో విజయం మాదే.. కేసీఆర్‌ పాలనను అంతం చేస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details