తెలంగాణ

telangana

Education Employees Arrested in Bribing Case Telangana : పాఠశాల అనుమతి కోసం లంచం డిమాండ్.. ముగ్గురు విద్యాశాఖ అధికారులు అరెస్టు

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 10:11 AM IST

Updated : Sep 22, 2023, 11:00 AM IST

Education Employees Arrested in Bribing Case
Education Employees Arrested in Bribing Case Telangana

10:02 September 22

Education Employees Arrested in Bribing Case Telangana : విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయంలో ముగిసిన అనిశా సోదాలు.. ముగ్గురు అరెస్టు

Education Employees Arrested in Bribing Case Telangana : హైదరాబాద్​లోని విద్యాశాఖ ఆర్జేడీ(RJD) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau) సోదాలు ముగిశాయి. ఏడీ పూర్ణచందర్​రావు, సూపరింటెండెంట్​ జగ్జీవన్​, ఆర్జేడీ పీఏ సతీశ్​లను అనిశా అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముగ్గురిని అధికారులు రిమాండ్​కు తరలించనున్నారు. సీబీఎస్​ఈ(CBSE) పాఠశాల అనుమతికి రూ.80వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు చిక్కారు. ఈ కేసుకు సంబంధించి ఆర్జేడీ విజయలక్ష్మిని అధికారులు ప్రశ్నించనున్నారు. పాఠశాల అనుమతి విధివిధానాలపై ఆర్జేడీని అధికారులు ప్రశ్నించనున్నారు.

అసలేం జరిగింది :ఫరూఖ్​నగర్​లో సీబీఎస్​ఈ పాఠశాల అనుమతి కోసం శేఖర్ అనే వ్యక్తి​ దరఖాస్తు చేసుకున్నారు. రంగారెడ్డి డీఈఓ కార్యాలయం నుంచి శేఖర్ దస్త్రం హైదరాబాద్ విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయానికి చేరుకుంది. నాలుగు నెలలుగా ఈ వ్యవహారం పెండింగ్​లోనే ఉంటోంది. బాధితుడు శేఖర్​ ఆర్జేడీ కార్యాలయం చుట్టూ నాలుగు నెలలుగా తిరుగుతున్నాడు. చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టు తిరిగినా తన పని మాత్రం కావడం లేదు.

Edu Dept Employees Arrested For Demanding Bribe : ఏం చేయాలో అర్థం కాని శేఖర్ మరోసారి ప్రయత్నిద్దామనుకున్నాడు. ఇందులో భాగంగానే విద్యాశాఖ ఆర్జేడీ విజయలక్ష్మి పీఏ సతీశ్​ను కలిశాడు. తన గోడును అతని వద్ద నెల్లబోసుకున్నాడు. ఆర్జేడీ విజయలక్ష్మి పీఏ... శేఖర్ గోడును విని వేరే ఇద్దరు ఆఫీసర్లున్నారు.. వాళ్ల వద్దకు వెళ్తే నీ పని అవుతుందని చెప్పాడు. హమ్మయ్య.. ఎట్టకేలకు నా పని జరుగుతుంది అని భావించిన శేఖర్ పీఏ మాటను నమ్మాడు. విజయలక్ష్మి పీఏ.. శేఖర్​ను.. అసిస్టెంట్​ డైరెక్టర్​ పూర్ణచందర్​ రావు, పర్యవేక్షకుడు జగ్జీవన్​ దగ్గరికి తీసుకెళ్లాడు.

పంథా మార్చని ప్రభుత్వ అధికారులు.. ఏసీబీకి దొరికి జీవితం ఆగం

పెద్ద సార్ల వద్దకు వెళ్తే పని అవుతుందనుకున్న శేఖర్​కు అక్కడ గట్టి షాక్ తగిలింది. తన స్కూల్​కు అనుమతులు ఇవ్వాలంటే తమకు కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏకంగా రూ.80వేలు లంచం డిమాండ్ చేయడంతో శేఖర్ కంగుతిన్నాడు. అంతగా ఇచ్చుకోలేనని వాళ్లకు చెప్పినా.. వారు వినిపించుకోలేదు. అనుమతులు కావాలంటే రూ.80వేలు తీసుకురమ్మని శేఖర్​కు చెప్పారు. బాధితుడు ఏం చేయాలో పాలుపోక.. అలాగని లంచం ఇవ్వలేక.. చివరకు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఆధారాలుతో సహా ఆ అధికారులను పట్టుకున్నారు. నిన్నటి నుంచి హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఇవాళ ముగ్గురు అధికారులు.. ఏడీ పూర్ణచందర్​రావు, సూపరింటెండెంట్​ జగ్జీవన్​, ఆర్జేడీ పీఏ సతీశ్​లను అరెస్టు చేశారు. ఫరూఖ్ నగర్ పాఠశాల దస్త్రం ఆపడానికి గల కారణాలపై ఆర్టేడీ విజయలక్ష్మిని ప్రశ్నించి తెలుసుకుంటామని ఏసీపీ అనిశా డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.

Health Officer Caught Taking Bribe in Medak :మరో కేసులో మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (డీఎం అండ్​ హెచ్​ఓ)లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్​ ఆఫీసర్​ ఫహిం పాషా రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. స్థానిక డిపో బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద అతను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిజియో థెరపిస్ట్​ సతీశ్​​ నర్సాపూర్​ పట్టణంలో ఫిజియో థెరఫీ క్లినిక్​ ఏర్పాటు చేసేందుకు పర్మిషన్​ కోసం నెల రోజుల కింద ఆన్​లైన్​లో అప్లై చేశారు. ఆ తర్వాత జిల్లా కేంద్రమైన మెదక్​ పట్టణంలోని డీఎంహెచ్​ఓ ఆఫీస్​కు వెళ్లి అవసరమైన సర్టిఫికెట్​లు, బ్యాంక్​ డీడీ అందజేశారు. సంబంధిత ఫైల్​ ప్రాసెస్​ చేసేందుకు ఆఫీస్​లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్​ ఆపీసర్​ (సీహెచ్​ఓ) ఫహీం పాషా రూ.15 వేలు డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని తెలపడంతో సతీశ్​ ఏసీబీ ఆఫీసర్​లను కలిసి డీఎంహెచ్​ఓ ఆఫీస్​లో పర్మిషన్​ ఫైల్​ ప్రాసెస్​ కోసం లంచం అడిగిన విషయమై ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గురువారం ఫహీం పాషా మెదక్​ పట్టణంలోని డిపో బస్టాండ్​ దగ్గర సతీష్​ నుంచి లంచం తీసుకుంటుండగా అప్పటికే అక్కడ నిఘా వేసి ఉన్న ఏసీబీ ఆఫీసర్​లు రైడ్​ చేసి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

TU VC Ravinder Caught by ACB Officials : ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్

ఏసీబీ దాడుల్లో పట్టుబడిన రూ.42 లక్షలు.. ఆ అధికారివేనా?

Last Updated : Sep 22, 2023, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details