తెలంగాణ

telangana

e-Challan Frauds in Hyderabad : ఈ-చలానా మెసేజ్‌ మీకూ వచ్చిందా.. అయితే బీ కేర్​ఫుల్

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 2:28 PM IST

e-Challan Frauds in Hyderabad: ప్రజల డబ్బు దోచుకునేందుకు ఎప్పటికప్పుడు మారువేషాలు వేస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. ఇప్పుడు ట్రాఫిక్‌ పోలీసుల అవతారమెత్తారు. ట్రాఫిక్‌ చలానాలు(e-Challan) చెల్లించాలంటూ బూటకపు సందేశాలతో మోతెక్కిస్తున్నారు. ఇవి నిజమేనని కొందరు తమకు వచ్చిన సందేశాల్లోని లింకులు క్లిక్‌ చేసి రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు.

Cyber Crime Cases in Hyderabad
e-Challan Cyber Frauds in Hyderabad

e-Challan Frauds in Hyderabad: ఎన్నడూ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించకున్నా.. ఎక్కడా గీత దాటకున్నా పోలీసులు చలానా విధించినట్లు ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. రూ.వేలల్లో కట్టాలని, లేకపోతే జైలుకెళ్తారంటూ హెచ్చరికలు వస్తుంటాయి. చలానాలపై 50 శాతం తగ్గింపు అంటారు. ఇవి పోలీస్, రవాణా శాఖలు పంపించిన సందేశాలు కావు.. సైబర్‌ నేరగాళ్ల మాయ. ప్రజల డబ్బు దోచుకునేందుకు ఎప్పటికప్పుడు మారువేషాలు వేస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. ఇప్పుడు ట్రాఫిక్‌ పోలీసుల అవతారమెత్తారు.

Fake e Challans in Hyderabad : ట్రాఫిక్‌ చలానాలు(e-Challan) చెల్లించాలంటూ బూటకపు సందేశాలతో మోతెక్కిస్తున్నారు. ఇవి నిజమేనని కొందరు తమకు వచ్చిన సందేశాల్లోని లింకులు క్లిక్‌ చేసి రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు.

Cyber frauds in Hyderabad : కామెంట్లు కావాలన్నారు.. కట్​ చేస్తే.. రూ. 1.10కోట్లు కొట్టేశారు

Cyber Crime Cases in Hyderabad :నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వాహన యజమాని నంబర్లకు చలానా వివరాలు సందేశాలుగా వస్తాయి. సైబర్‌ నేరగాళ్లు దీన్నే సొమ్ము చేసుకుంటున్నారు. ఈ-చలానా పేరుతో నకిలీ సందేశాలు పంపిస్తున్నారు. సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని, డబ్బు కట్టేందుకు లింకు క్లిక్‌చేయాలని సూచిస్తారు. లింక్​పై క్లిక్‌ చేస్తే మొబైల్​లోని డేటా మొత్తం నేరస్థుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కొన్నిసార్లు మొబైల్ హ్యాక్‌ అవ్వడం, ఎనీ డెస్క్‌ తదితర యాప్‌లు డౌన్‌లోడ్‌ అవుతాయి. తర్వాత సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని సొమ్మంతా కొట్టేస్తారు. కొన్నిసార్లు మొబైల్​లోని ఫొటోలు, వ్యక్తిగత వివరాలు సేకరించి డబ్బు కొట్టేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వాహనదారుల డేటా ఎలా..? సైబర్‌ నేరగాళ్లకు వాహనాల యజమానులకు సంబంధించిన డేటా, ఫోన్‌ నంబర్లు ఎలా వెళ్తున్నాయన్నది పెద్ద ప్రశ్న. కొన్ని ప్రైవేటు సంస్థల్లో భద్రతా వ్యవస్థలు సక్రమంగా లేకపోవడం, ఉద్యోగుల తప్పిదాలతో డేటా బయటకు వెళ్తుంది. ట్రాఫిక్‌, రవాణా శాఖలకు ఇచ్చిన వాహనదారుల డేటా ఎలా బయటకు వెళ్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మందికి సొంత వాహనాలు ఉన్నందు వల్ల.. ఒకేసారిగా అందరికీ సందేశాలు పంపిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని సైబర్‌క్రైమ్‌ అధికారులు తెలిపారు.

ఫిర్యాదు చేయొచ్చిలా..నకిలీ ఈ-చలానాల పేరుతో మెసేజ్​లను నమ్మి డబ్బు పోగొట్టుకుంటే.. వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. ఒకవేళ మీ వాహనాలపై చలానా ఉన్నట్లు సందేశం వస్తే.. పోలీసు శాఖ ఆధ్వర్యంలోని ‘ఈ-చలానా’ వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవాలి. అందులో ఉంటేనే రుసుము చెల్లించాలి. ఈ తరహా అనుమానాస్పద నకిలీ మెసేజ్​లు వస్తే.. వాటిని ప్రత్యేక వాట్సాప్‌ నంబరు 87126 72222 కు పంపి ఫిర్యాదు చేయాలి.

Cyber Cheatings in Patancheru : సైబర్​ నేరగాళ్ల నయా రూట్​.. ఫుడ్​ ఆర్డర్​ క్యాన్సిల్​ చేసినందుకు ఖాతా ఖాళీ

online Business Frauds : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు.. నమ్మి అత్యాశకు పోతే అసలుకే మోసం

ABOUT THE AUTHOR

...view details