తెలంగాణ

telangana

బాలుడిని కిడ్నాప్​ చేసిన బాలుడు... రూ.3 లక్షలు డిమాండ్

By

Published : Nov 18, 2019, 9:05 AM IST

Updated : Nov 18, 2019, 12:23 PM IST

హైదరాబాద్ మీర్ పేట్ ఠాణా పరిధిలోని టీఎస్ఆర్ కాలనీలో కిడ్నాప్ కలకలం రేపింది. బాలుడిని అపహరించి... మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడో పిల్ల ప్రబుద్ధుడు.

బాలుడి కిడ్నాప్... రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన 14 ఏళ్ల ప్రబుద్ధుడు

బాలుడి కిడ్నాప్... రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన 14 ఏళ్ల ప్రబుద్ధుడు

హైదరాబాద్ మీర్ పేట్ ఠాణా పరిధిలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఏడు సంవత్సరాల బాబును 14 ఏళ్ల బాలుడు కిడ్నాప్​కు స్కెచ్ వేశాడు. కిడ్నాపర్ పదో తరగతి చదువుతున్న మైనర్ కావడం గమనార్హం. డబ్బులిస్తాం రమ్మని పిలిచి పోలీసులు పట్టుకున్నారు. డబ్బులు కోసం నాటకం ఆడి మూడు గంటల పాటు తల్లి దండ్రులు, కాలనీ వాసులు, పోలీసులకు చెమటలు పట్టించాడు. కిడ్నాప్ చేసిన ఇంటి పరిసరాల్లోనే ఉంటూ హైడ్రామా సృష్టించాడు. ఏం చేయాలో తెలియక తల్లి దండ్రులు ఆందోళన పడ్డారు. అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించాడు.

మాటలు కలిపి... అల్మాస్​గూడ తీసుకెళ్లి...

మీర్ పేట్ పరిధిలోని టీఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్న రాజు ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కొడుకు ఏడేళ్ల అర్జున్ బడంగ్ పేట్ మౌంట్ కార్మెట్ స్కూల్​లో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా అతనితో మాటలు కలిపి మీర్ పేట్ నుంచి అల్మాస్​గూడ వరకు తీసుకెళ్లాడు కిడ్నాపర్... అక్కడి నుంచి తండ్రి రాజు​కు ఫోన్ చేసి 'మీ కొడుకుని కిడ్నాప్ చేశా'మంటూ బెదిరించాడు. విడుదల చేయాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాలుడి తండ్రి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయగా... నిందితుడి కాల్ డేటా వివరాలను పరిశీలించిన పోలీసులు అల్మాస్​గూడకి చెందిన వెంకటేష్ పేరుతో అడ్రస్ ఉందని గుర్తించారు. సోదా కోసం అక్కడ ఇంటికి వెళ్తే ఎవ్వరూ లేరు. అప్పుడే నిందితుడి నుంచి మారోమారు పోన్ వచ్చింది.

డబ్బులిస్తాం రా...

డబ్బులు తెచ్చామని... అల్మాస్​గూడ కమాన్ దగ్గరకు వస్తే ఇస్తామని కిడ్నాపర్​కు రాజు చెప్పాడు. బాలుడు కమాన్ దగ్గర రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి : విషాదం: తండ్రి ఆగ్రహం.. కొడుకు బలవన్మరణం

Last Updated : Nov 18, 2019, 12:23 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details