తెలంగాణ

telangana

మరో వాయుగుండం! 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం

By

Published : Nov 29, 2020, 11:05 AM IST

దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో వాయుగుండం మరింత తీవ్రమై తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

another-cyclone-is-turn-into-a-hurricane-in-48-hours-at-andaman-sea
మరో వాయుగుండం! 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం

దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం.. రాగల 48 గంటల్లో వాయుగుండంగా బలపడే సూచనలు కనిపిస్తున్నట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం మరింత తీవ్రమై తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. డిసెంబర్ 2 నాటికి తమిళనాడు వద్ద తీరం దాటనుండగా.. డిసెంబర్ 1 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు వున్నట్లు వెల్లడించింది.

తమిళనాడు, పుదుచ్చేరిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. రాగల 24 గంటల్లో ప్రకాశం, కర్నూలు తదితర చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ సూచించింది.

ఇవీ చూడండి:కేసీఆర్ చేపట్టిన​ దీక్షకు నేటికి 11 ఏళ్లు​ పూర్తి

ABOUT THE AUTHOR

...view details