ETV Bharat / state

కేసీఆర్ చేపట్టిన​ దీక్షకు నేటికి 11 ఏళ్లు​ పూర్తి

author img

By

Published : Nov 29, 2020, 10:43 AM IST

Updated : Nov 29, 2020, 10:57 AM IST

కేసీఆర్​ దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తి. అయితే దీనిపై మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​లో భావోద్వేగ భరిత పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం.. సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అంటూ ట్విట్టర్​లో​ పేర్కొన్నారు.

minister ktr tweeted about kcr deeksha
కేసీఆర్ చేపట్టిన​ దీక్షకు నేటికి 11 ఏళ్లు​

తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్​ చేపట్టిన దీక్షకు నేటితో పదకొండు ఏళ్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం తెరాస అధినేత కేసీఆర్​... 2009 నవంబర్​ 29న నిరాహార దీక్ష చేపట్టారు.

తెలంగాణ సాధన కోసం కేసీఆర్​ చేసిన కృషికి నిదర్శనంగా ఏటా నవంబర్​ 29 దీక్షా దివాస్​గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​.. ట్విట్టర్​ ద్వారా ప్రజలకు దీక్షా దివాస్​ శుభాకాంక్షలు తెలియజేశారు. దీక్షా దివాస్​ స్ఫూర్తిని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం... యావత్​ తెలంగాణ ప్రజలని, సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అంటూ భావోద్వేగ భరిత పోస్ట్ చేశారు. ఆ నాటి కేసీఆర్​ ఫోటోలను సైతం ప్రజలతో పంచుకోవటం విశేషం.

  • “దీక్షా దివస్-నవంబర్ 29"

    తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష 🙏

    తెలంగాణ ప్రజానీకానికి దీక్షా దివస్ శుభాకాంక్షలు

    జై కేసీఆర్! జై తెలంగాణ pic.twitter.com/DcIRaWbeAi

    — KTR (@KTRTRS) November 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated : Nov 29, 2020, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.