దుబాయ్ వేదికగా దిల్లీ(dc vs csk 2021)తో జరిగిన ఐపీఎల్ 2021(ipl 2021 news) తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. చివరిలో వచ్చిన ధోనీ(dhoni kohli).. మెరుపు ఇన్నింగ్స్ ఆడి తనదైన శైలిలో ఫినిషింగ్ ఇచ్చి.. జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. చివరి ఓవర్లో ఓ సిక్స్, మూడు ఫోర్లు బాది విజయానికి అవసరమైన 18 పరుగులు(6 బంతుల్లో) చేశాడు ధోనీ. ఈ నేపథ్యంలో అతడిపై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ(kohli on dhoni).. ధోనీ 'గొప్ప ఫినిషర్' అని కితాబిచ్చాడు.
"దిల్లీతో జరిగిన మ్యాచ్లో మునపటి ధోనీ మళ్లీ కనిపించాడు. చివరిలో ధోనీ ఇన్నింగ్స్ నన్ను ఎగిరి గెంతులేసేలా చేసింది. ఎప్పటికీ ధోనీయే గొప్ప ఫినిషర్" అని కోహ్లీ ట్వీట్ చేశాడు.