IND Vs SA 3rd ODI Impact Fielder :దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్ సిరీస్లో టీమ్ఇండియా అదరగొట్టింది. 2-1 తేడాతో సిరీస్తో కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్లో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన ఆటగాడిని ఇంపాక్ట్ ఫీల్డర్ మెడల్తో టీమ్ఇండియా మేనేజ్మెంట్ సత్కరించింది. ఈ అరుదైన గౌరవం యంగ్ క్రికెటర్ సాయి సుదర్శన్కు దక్కింది.
అయితే ఈ మెడల్ కోసం టీమ్ఇండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, సంజూ శాంసన్ మధ్య తీవ్రపోటీ నెలకొంది. మూడో వన్డే మ్యాచ్లో అద్భుతమైన క్యాచ్ పట్టిన సాయి సుదర్శన్వైపే ఫీల్డింగ్ కోచ్ రాత్రా మొగ్గు చూపాడు. కాగా, ఈ సిరీస్లో కేఎల్ రాహుల్ ఆరు క్యాచ్లు అందుకున్నాడు. సంజూ శాంసన్ కూడా రెండు క్యాచ్లు పట్టాడు. కానీ సాయి సుదర్శన్ చివరి మ్యాచ్లో కీలకమైన క్యాచ్ పట్టాడని. అందుకే మిగతా ఇద్దరిని కాదని అతడికే మెడల్ ఇస్తున్నట్లు రాత్రా వెల్లడించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సాయి సుదర్శన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. టీమ్ఇండియా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన 400వ ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ సిరీస్లో సాయి సుదర్శన్ 127 పరుగులు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఇందులో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో రెండోసారి వన్డే సిరీస్ను నెగ్గిన రెండో భారత కెప్టెన్గానూ కేఎల్ రాహుల్ అవతరించాడు. 2017/18 సీజన్లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమ్ఇండియా సిరీస్ను సొంతం చేసుకుంది.